రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కాటసాని రాంభూపాల్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, పరీక్షలు, కౌన్సెలింగ్, సకాలంలో చికిత్స పొందేలా ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ రాజకుమారి అఽధికారులను ఆదేశించారు.
మొక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించడంతో ఆకులు తెల్లబారుతున్నాయి. అంతో ఇంతో వచ్చిన పంట కాస్తా పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చని వ్యవసాధికారులు అంటున్నారు.
కర్నూలు నగరం- గొందిపర్ల గ్రామం మధ్య తుంగభద్ర నదిపై శాశ్వత వం తెన నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త అనంత రత్నం, కర్నూలు నగర అధ్యక్షుడు షేక్ జిలాని బాషా సోమవారం కలెక్టర్ను వినతి పత్రం అందజేశారు.
ఎస్సీ క్రైస్తవులు, ముస్లింల హక్కులను కాలరాయొద్దని, వారికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పెట్టిన భిక్ష వల్లనే తనకు మంత్రి పదవి లభించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోవెలకుంట్ల పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. సంతపేట, సంతమార్కెట్, అయ్యప్ప స్వామి దేవాలయం వీధి, ఇందిరమ్మ కాలనీ, సరస్వతీదేవి ఆలయ కాలనీలలో రూ 2.81 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తున్న రైతులు వివిధ కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.