రాష్ట్రాభిృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలోని రహదారులు గుంతలమయం లేకుండా చేసేందుకు రూ.3వేల కోట్లతో పూర్తి చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి తెలిపారు.
వన్మంత్ ఫోర్ విజిట్తో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
నీవే నాప్రాణం అని.. నీవు లేనిది జీవితం లేదని బాసలు చేశాడు. నాలుగేళ్లుగా ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమలో హద్దులు దాటారు. ఇప్పుడు అంతా అయిపోయాక పెళ్లి ప్రస్తావన రాగానే మొహం చాటేశాడు. కులాల వేరని, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవాల్సిందేనని ప్రియు రాలు మొండికేసి అతడి ఇంటి ముందు దీక్షకు సిద్ధమైంది. దీంతో ఆ కుటుంబమంతా ఇంటికి తాళం వేసి నాయకుల వద్ద పంచాయితీకి సిద్ధమయ్యారు. ఆ పెద్ద మనుషులు ప్రేమకు వెల కట్టారు. తనకు డబ్బు వద్దు.. న్యాయం కావాలని ఆమె దీక్ష కొనసాగిస్తోంది.
ఇద్దరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలోనే గొడవ పడ్డారు. ఈఘటన పత్తికొండలో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ కుటుంబమంతా వివాహ వేడుకలు ముగించుకున్నారు. నూతన వధూవరులు సంతోషంగా ఉన్నారు. అంతా సవ్యంగా సాగడంతో రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. స్వామి దర్శనార్థం కుటుంబీకులంతా కలిసి ఆటోలో బయలుదేరారు. గురువారం మంత్రాలయానికి చేరుకొని దర్శనాలు పూర్తయ్యాక రాత్రి అక్కడే బస చేిసి మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామి సన్నిధికి వెళ్లారు. రాఘవేంద్రాయ.. మమ్ము చల్లగా చూడు స్వామి అని మొక్కుకున్నారు. ఆటోలోనే తిరుగు ప్రయాణమయ్యారు. కొద్ది దూరం వెళ్లగానే ఓ కుక్క అడ్డు వచ్చింది. ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. వరుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
పొదుపు మహిళల అభివృద్ధికి సంబంధించి వార్షిక ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయాలని వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనుమనాయక్ తెలిపారు. శక్రవారం వెలుగు కార్యాలయంలో వీవోఏలతో సమావేశమయ్యారు.
: నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి కోవెకుంట్ల రస్తాలో నిర్మించిన రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
పేదప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తొందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
నంద్యాల జిల్లాకు చెందిన 17 ఏళ్ల తౌపిక్ అనే యువకుడు 2025 ఆగస్టు 30వ తేదీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జేసీబీ, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఆ యువకుని చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి.