చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా 12 పరిశ్రమల యూనిట్లకు రూ. 97.8 లక్షల రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
50 సంవత్సరాలు పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జీజీహెచ్లోని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ ఆఫీసు ఎదుట విధులు బహిష్కరించి పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు
విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీజీవీ సంస్థల నుంచి రూ.50 లక్షల చెక్కును సోమవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యకు అందజేశారు.
జిల్లాలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు. ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘటనలో నలుగురిని దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు.
రాష్ట్రంలోని పేదలకు గృహ వసతి కల్పనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి నగర్లో లబ్ధిదారుల గృహ ప్రవేశం నిర్వహించారు.
పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా లో 60 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 300 మంది నిరుగ్యోలు పాల్గొనగా, 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యలు నిర్వహించారు
ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. గతేడాది దాదాపు రూ.22 లక్షలకు పైగా లాభాలు ఆర్జించింది.
యువతీ యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు.