మహానంది పుణ్య క్షేత్రం వేలాది మంది భక్తులతో ఆదివారం కిటకిటలాడింది.
కర్నూలు నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం నాయకులు తాడుతో ఆటోను లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శనివారం పాతబస్టాండు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు
గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని ఆర్అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ దివాస్ పురస్కరించుకుని సంజామలలో జరిగిన స్వర్ణ ఆఽంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ఆలూరు బ్రాంచ్ కాలువ పరిధిలో అనుమతులు లేకుం డా పైపులైన్ వేస్తున్న 18 మంది నాన్ఆయకట్టు రైతులపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, ఎస్ఐ నరసింహులు శనివారం తెలిపారు
ప్రధానంగా వర్షాధార వ్యవసాయం చేసే రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలనే డిమాండ్ ఉద్యమరూపంగా సాగింది.
పెట్రోల్, డీజిల్పై పెం చిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప డిమాండ్ చేశారు.
ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం పాతబస్టాండులోని సూర్య ట్రేడర్స్, బంగారుపేటలో ఉన్న శ్రీశివరామకృష్ణ ఎరువుల దుకాణాన్ని జేసీ నూరుల్ ఖమర్తో కలిసి కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేశారు.