మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశమైంది. రాజధాని గ్రామాల సమస్యలపై, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004, ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ఏపీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలిపారు.