మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్ వివరించారు.
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్ చంచల్గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో నగదు చోరీతోపాటు అవకతవకలపై విచారణ చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు.
విజయవాడలో తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి మోసం చేయబోయిన నలుగురు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎస్సై వేషంలో వచ్చిన మాజీ హోంగార్డ్ హరికృష్ణ కీలక నిందితుడు. బాధితుడు ప్రసాద్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
ఈరోజు(సోమవారం) ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సైతం వెంకటరెడ్డికి నివాళులు అర్పించారు.
పరారీలో ఉన్న యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవోను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లాలోని ఓ ఆలయ ఈవో సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం.
గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి మరమ్మతులు చేయాల్సి ఉందా? రథ బాధ్యతల విషయంలో దుర్గగుడిలోని విభాగాల మధ్య వంతులాట జరుగుతోందా? రథంలో ఒక పరికరం పాడైనట్టు ఇప్పటికే గుర్తించారా? అసలు విషయాన్ని గోప్యంగా ఉంచి దేవస్థానం రోజులు గడుపుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ విషయంలో దేవస్థానంలోని మూడు విభాగాల మధ్య అంతర్గతంగా వాదులాటలు జరుగుతున్నాయి.
తాడిగడపలో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2.30 లక్షల నగదు దోచుకెళ్లారు. కిటికీకి అమర్చిన ఇనుప ఫ్రేమ్ను శబ్ధం రాని చార్జింగ్ కటర్తో కట్చేసి ఇంట్లోకి ప్రవేశించారు. దోపిడీలో మొత్తం నలుగురు దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కొన్నిరోజుల నుంచి పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో కృష్ణా యూనివర్సిటీకి మంచిరోజులు కనిపిస్తున్నాయి. 14 నెలలుగా ఇన్చార్జి రిజిస్ర్టార్ పాలనలోనే వర్సిటీ కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ కొత్త రిజిస్ర్టార్ను నియమిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో నూతన రిజిస్ర్టార్ నియామకంపై ప్రచారం జోరందుకుంది. అలాగే, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై వర్సిటీలో పాలన గాడిన పడనుంది.