విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజులకే మళ్లీ ఈ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్ గా ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నారు.
సైబర్ నేరాలను ఎంతగా అరికట్టాలని చూసినా.. నేరగాళ్లు మాత్రం అంతకంతకు రెచ్చిపోతున్నారు. విజయవాడ నగర సీపీ రాజశేఖర బాబు వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.
'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.
స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వల్లనే అని పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదని మండిపడ్డారు.
వంగవీటి రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని తన కుమార్తె ఆశా కిరణ్ ఉద్ఘాటించారు. ప్రజల జీవితానికి కొంత కాలంగా దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనేనని.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ చొరవతో అంతర్జాతీయ సర్వీసు మొదలు కావడంపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూలపాడు నగరవనంతో పాటు కొండపల్లి రిజర్వు ఫారెస్టు అందాలను వీక్షించేందుకు జిప్లైన్ అడ్వెంచర్ రెడీ అవుతోంది. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో పర్యాటక, అటవీశాఖ అధికారులు దీనిని ఏర్పాటు చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు.