కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై వచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బాపు మ్యూజియంలోని విక్టోరియా హాల్లో నిర్వహించే లేజర్ షోకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు.
ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ టీమ్తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ని కుదించుకుంటున్నారు.
సంపద సృష్టించడం చాలా సులభమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికే మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్నిఅభివృద్ది చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
రోజుకి 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్పై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.