వైసీపీపై విరుచుకుపడ్డారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వైసీపీ సభ్యులు ఏదైనా రాజకీయం చేస్తారన్నారు. శాసనసభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు
రాళ్లపాడు రిజర్వాయర్, ఎడమ కాలువ పనుల పురోగతిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్ళపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు రూ.36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి, టెండర్లను ప్రీక్లోజర్ చేసిందని విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గంజాయి నియంత్రణపై ఎమ్మెల్యే జయకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.
కలలు కన్నారు.. కష్టించారు.. ఫలితం పొందారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్లో ఉమ్మడి కృష్ణాజిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలోని చైతన్య, నారాయణ, వశిష్ట, శారద విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ప్రతిభ చూపారు. నూరుశాతం పర్సంటైల్ మార్కులను విజయవాడ చైతన్య కాలేజీ (గాయత్రి క్యాంపస్) విద్యార్థి పసల మోహిత సాధించాడు. ఇదే క్యాంపస్ నుంచి కాటా హిమకర్ 99.99, గన్ని సాయి సాత్విక్ 99.99, ముక్కర సాకేత 99.99 పర్సంటైల్ మార్కులు పొందారు. తమ విద్యాసంస్థల్లో చదివిన చల్లా సాయి వెంకట ఆదిత్య (99.80 శాతం), కట్టా హితేష్ (99.77 శాతం), సీబీ జయంత (99.69 శాతం), ధ్రువంతేజ్ (99.14 శాతం), రిషి కీర్తన్రెడ్డి (99.12 శాతం) మంచి మార్కులు సాధించారని శ్రీవశిష్ట విద్యాసంస్థల చైర్పర్సన్ లింగమనేని ప్రమీలరాణి తెలిపారు. - ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ
కృష్ణాజిల్లాలో సాగరతీరానికి సమీపంలో రెండు భారీ రిసార్ట్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదిరింది. రూ.158 కోట్లతో బే వ్యూ రిసార్ట్స్ను ఏర్పాటు చేయటానికి ‘మైరా’ గ్రూప్ ముందుకొచ్చింది.
ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తొలిసారిగా విజయవాడలో కాలుమోపారు. ఇప్పటి వరకు కంప్యూటర్లతో ఆడుకున్న ఆయన బెజవాడ గడ్డపై బ్యాట్ పట్టారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కలిసి షటిల్ ఆడారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై.. వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు.
బిల్ గేట్స్కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.