మన రాష్ట్రం నుంచి అక్రమంగా వెళ్తున్న ఇసుక లారీలు తెలంగాణాలో పట్టుబడుతున్నాయి. అక్కడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్, పోలీసులు, రవాణా, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రం నుంచి తెలంగాణాకు ఇసుక అక్రమంగా తరలివెళ్తుంటే, మన పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్, మైనింగ్, రవాణా, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
బ్రహ్మయ్యలింగం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఒమన్ దేశం ఆసక్తి చూపిస్తోంది. ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు సుల్తాన్ బిన్ తారిఖ్ ఈ చెరువు గురించి తెలుసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కనబరుస్తున్నారు.
మున్సిపల్ అధికారుల అనాలోచిత నిర్ణయం కృష్ణా యూనివర్సిటీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వర్సిటీకి 900 మీటర్ల దూరంలోని భూములను డంపింగ్ యార్డుగా మార్చేయడంతో అటు విద్యార్థులు, అధ్యాపకులు, ఇటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త, ఇతరత్రా వ్యర్థాలను డంప్ చేస్తుండటంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతూ అపరిశుభ్రత తాండవిస్తోంది.
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చీజ్కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు జారీ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారంటూ నోటీసులు పంపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కస్తూరిబా బాలికా విద్యాలయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.