వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేనివని చెప్పుకొచ్చారు.
కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ ద్వారా సరఫరా చేసే బియ్యంలో 10 శాతం నూకల విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.
మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల సేవలో.. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయవాడలోని కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మత్స్యకారులు మద్దతు తెలియజేశారు.
నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్లో 25 మందిపై అభియోగాలు మోపారు.
మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డంపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు.
జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ప్రకటించారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపై ఆమె తలపై బండ రాయితో దాడి చేశాడు.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.