స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు.
విజయవాడ పశ్చిమ బైపాస్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని స్పష్టం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ.. ఓ విద్యార్థిని పట్ల మానవత్వం చూపారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను భుజంపై ఎత్తుకుని సుమారు 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందేలా చేశారు.
రుషికొండ భవనాల విషయంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హిల్టాప్లోని భవనాల నిర్వహణ, ఆపరేషన్, మార్కెటింగ్ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెస్ట్ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కోర్టుకు సిట్ ముఖ్య విషయాలు తెలియజేసింది.
వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్ఫారమ్లు వెంటనే ప్రారంభించాలని.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలన్నారు.
మచిలీపట్నం ఇనగుదురు పోలీస్స్టేషన్లో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ను ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు.
పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.