గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు.
ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.
కృష్ణా జిల్లా కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు.
తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుందని ఆయన అన్నారు. గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్లకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో కొండపల్లి మున్సిపాలిటీలోని అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాసెస్ చేయనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
విజయవాడలోని గిరిపురంలో డయేరియా ప్రబలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎమ్హెచ్ఓ శ్రావణ్ కుమార్ గిరిపురంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.