ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై సభలో ఎమ్మెల్యే ప్రశ్నించగా.. మంత్రి కందుల దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
మొన్న జయంతి.. నిన్న వత్సవాయి, నాగాయలంక, గంగూరు.. ఇలా రేషన్ అక్రమ బియ్యం నిల్వలు భారీగా బయటపడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ బియ్యం నిల్వలపై సివిల్ సప్లయిస్ అధికారులు దాడులు చేస్తుండగా, గంగూరులో రికార్డు స్థాయిలో 2,549 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈనెలాఖరుకు నూరుశాతం ఇంటిపన్ను వసూళ్లే లక్ష్యంగా గ్రామాల్లో అధికార యంత్రాంగం దీక్షబూనింది. ప్రభుత్వం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించటంతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రామాల్లో వసూళ్లను వేగవంతం చేస్తున్నారు. ఈవోఆర్డీ, ఎంపీడీవో, డీఎల్పీవోలే కాదు.. డీపీవో సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్నుల వసూలుపై సమీక్షలు జరుపుతున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ చెల్లింపుల ద్వారా పన్నులు నేరుగా ప్రభుత్వ ఖాతాకు జమ అవుతున్నాయి.
మహాక్రతువుకు ముహూర్తం దగ్గరకొచ్చింది. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకానికి శుక్రవారం అంకురార్పణ జరగనుంది. జెండాపై కపిరాజు ఉత్సవ శంఖారావం పూరించగా, మూడు రోజులు జరగనున్న మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేద పండితులు, అర్చకులు, పవిత్ర సముద్ర, నదీ జలాలను సిద్ధం చేయడంతో ఇంద్రకీలాద్రి ఉత్సవ కాంతులతో వెలిగిపోతోంది.
వెలిగొండ ప్రాజెక్ట్కు శంకుస్థాపన జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. వెలిగొండకు శంకుస్థాపన చేసింది తానే అని.. పూర్తి చేసేది కూడా తానే అని సీఎం తెలిపారు.
భారత్తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ రేట్ తగ్గే పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు సీఎం.
ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.
ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని.. అలాంటిది అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం సబబు కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీలో జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు.
చైర్మన్ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.