ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2008లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం కోసం పటిష్ఠమైన యువజన విభాగం నిర్మించాలని ప్రణాళిక చేశానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం నిర్వకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈనెల 28లోపు ప్రజలకు వివరించాలన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మహత్తర కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు సైకిల్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు.
పద్మవిభూషణ్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్లో నివాళులు అర్పించారు.
విధ్వంస పాలన నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తి అయ్యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనతో జగన్.. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు.
రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై రాజకీయ ప్రేరేపిత చర్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేడు కుల చట్రాల్లో బంధించడానికి సగటు రాజకీయ ఆలోచనలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు.