ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో సోదరులు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వ్యర్థాలను పారబోసిన చోటే బంగారాన్ని వెలికి తీస్తున్నారు చిత్తూరు జిల్లా సంచారజీవులు. జీవనంలో భాగంగా పెనుగంచిప్రోలు వచ్చినవారు స్థానికంగా ఉన్న మున్నేరులో బంగారం సేకరణ చేస్తున్నారు.
జిల్లాలోని వినియోగదారులకు ఐవోసీఎల్, బీపీసీఎల్ హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన 56 ఏజెన్సీల నుంచి వంట గ్యాస్ సరఫరా అవుతోంది. కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేసిన తర్వాత డొమెస్టిక్ సిలిండర్కు కొరత లేకుండా పోయింది.
పది పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పేర్కొన్నారు.
‘మేము నోటీసు ఇస్తాం.. మీరు తవ్వుకోండి..’ ఇదీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ (పీఐపీఆర్ఎంసీ) విజయవాడ డివిజన్-5 అధికారుల తీరు. అనుమతులకు విరుద్ధంగా పోలవరం కుడికాల్వ గట్టు అక్రమ తవ్వకాలను కొత్తూరు తాడేపల్లి ప్రజలు ఇటీవల అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
వేయి మునులు తపస్సు చేసిన ప్రాంతం వేయి మునుల కుదురు. ఆ తర్వాత అది యనమలకుదురు రామలింగేశ్వరస్వామి క్షేత్రంగా మారింది. మహిమాన్విత ఈ క్షేత్రంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు. వీరి పాపాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. హుండీ సొమ్మే కాదు.. దాతలిచ్చిన విరాళాలు, దేవస్థానానికి లైటింగ్, పూలదండలు, చీరల అమ్మకాలు, కిరాణా దుకాణాలు, కల్యాణ మండపాల్లో డబ్బును ఈవో భవానీ అండ్ కో దిగమింగిందన్న కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అంతేకాదు.. పవిత్రమైన ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లడం సంచలనంగా మారింది.
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా మోస్తున్నారని మండిపడ్డారు.
గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ప్యానిక్ అవ్సాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీంను ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు.
ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై చర్చించారు.