తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలను గత 20 నెలలుగా పూర్తి అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ ఉచ్చులో పడకుండా టీడీపీ శ్రేణులను నియంత్రించామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా టీటీడీ లడ్డు నెయ్యి కల్తీపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకోవడంపై ప్రధాని మోదీని సీఎం అభినందించారు.
అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా, 2012లో లండన్లో ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించనుంది.
తన నివాసంపై పెట్రోల్ బాంబులు వేశారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆగ్రహంతో అంబటిపై దాడి చేస్తే దాన్ని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు.
మాజీ సీఎం జగన్పై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును శత్రువుగా భావించిన జగన్.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి 53 రోజుల పాటు జైలుకు పంపారని మండిపడ్డారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అలజడులు సృష్టించాలని ప్లాన్ చేస్తోందని సీనియర్ మంత్రులు విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్లో వైసీపీ ట్రాప్లో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు.