ఎప్పుడెప్పుడా.. అని ఆశగా ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం నెమ్మదిగా ముందుకు కదులుతోంది. డిసెంబరు లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని అందరూ భావించగా, ఇప్పటి వరకు జరిగిన పనులను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా, మరో 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ 3, 4 మిగులు పనుల్లో కూడా కదలిక రావడంతో మార్చి నాటికి ఈ బైపాస్కు మార్గంసుగమం అయ్యేందుకు ఆస్కారం ఉంది.
కుప్పం నియోజకవర్గంలో రూ. రూ.2,203 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 23 వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వైసీపీ అంతమయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
క్వాంటమ్ కంప్యూటర్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు.
విజయవాడ విమానాశ్రయంలో సరికొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, అనుబంధ కాంప్లెక్స్ పనులు పూర్తయ్యాయి. ఎయిర్పోర్టులో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్కు అనుసంధానంగా ఈ టవర్, కాంప్లెక్స్ పనులను రూ.80 కోట్లతో చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి చేపట్టి, భక్తులకు పెద్దపీట వేస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. వన్టౌన్ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలో ఉన్న ఆలయ సమావేశపు కార్యాలయంలో పాలకమండలి మొదటి సమావేశం శుక్రవారం జరిగింది.
నకిలీ మద్యం తయారీ కేసులో నలుదిక్కుల్లో మూలాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు చేసిన పనులపై ఎక్సైజ్, సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుంటుండంతో నిందితుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. తాజాగా శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మరో ఏడుగురిని కస్టడీలోకి తీసుకున్నారు.
తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. మొత్తం 24 అంశాలకుగాను 18 ఆమోదించామని చెప్పారు.
ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వీరందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.