Home » Andhra Pradesh » Kadapa
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నాటి కడప పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పెండ్లిమర్రిలో నిర్వహించే 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఈ సాయంత్రానికే శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు సీఎం.
డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.
ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు అవినాశ్ రెడ్డి.
వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సునీత పిటిషన్కు ఏ2 సునీల్ యాదవ్ మద్దతు తెలిపారు.
కడపకు చెందిన మహబూబ్ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డి మొహం చాటేసినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్ఖాన్ కోర్టును ఆశ్రయించారు.
ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
కడప సెంట్రల్ జైలుకు వచ్చిన NIA అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న ఇద్దరు ఉగ్రవాదుల్ని తమిళనాడు ఐబీ అధికారులు అరెస్టు..
హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆ చిత్ర యూనిట్కు నోటీసులు జారీ చేశారు.