Home » Andhra Pradesh » Kadapa
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ భారీ విజయం సొంతం చేసుకుంది.
పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డినేనని.. రీ పోలింగ్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. జగన్ కంచుకోట గోడలను బద్దలు కొట్టమనే సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పులివెందులతో పాటు రాష్ట్ర మంతటా ఈ టీడీపీ నేతల సంబరాలతో పల్లెల నుంచి పట్నం వరకు అంత పసుపు మాయం అయింది.
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచిందని మారెడ్డి లతారెడ్డి ఉద్ఘాటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఒడిస్తామని మారెడ్డి లతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తన కంచుకోట అనే చెప్పుకునే జగన్ కు అక్కడి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జగన్ బై చెప్పి.. టీడీపీకి జై కొట్టారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని కూడా అమలు చేస్తోంది.