Home » Andhra Pradesh » Kadapa
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
శివశంకర్ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్ను ఆశ్రయించారు.
పార్టీల అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ మురళి నాయక్ సూచించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్లగొండ వారి పల్లెలో ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు.
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేసారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
వివేకా హత్యకేసుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.