Home » Andhra Pradesh » Guntur
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్ను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు.