Home » Andhra Pradesh » Guntur
రాజధాని అమరావతి ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం తెలపడంతో సందడి మెుదలైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని.. అవసరం కోసం వచ్చే అవకాశవాదులు పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం చేస్తోందని.. దీనిని ప్రజల్లోకి సగర్వంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట ప్రజలకు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. బుధవారం పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పి. హరి ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేది జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్దేశమని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది.
రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.