Home » Andhra Pradesh » Guntur
ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలని ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ డైనో డీట్స్ (Dino Deets) ప్రారంభించారు. అందుకు సంబంధించిన టీజర్ను ఆదివారం విడుదల చేశారు.
క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువ భారతీయులు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వాసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.