Home » Andhra Pradesh » Guntur
కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఆ క్రమంలో జగన్ మోహన్ రావు, జనార్దన్ రావు అనే వ్యక్తులు అరెస్ట్ చేశారు.
‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలకు ‘సాస్కి’ నిధుల ఫలాలు అందించాలని సూచించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఓరుగల్లును ఏలిన కాకతీయ మహారాణి రాణి రుద్రమ్మ దేవికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో అనుబంధం ఉంది. రాజదాని ప్రాంతంలోని మల్కాపురం ఆమెకు మనస్సుకు నచ్చని గ్రామమని చెబుతున్నారు. ఆ గ్రామంలో రాణి రుద్రమ్మ దేవి వేయించిన శిలా శాసనాలు సైతం నేటికి దర్శనమిస్తున్నాయి.
గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్ల్యాండ్కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మరికొన్ని గంటల్లో తిరువూరు పంచాయితీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు రాబోతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు వేర్వేరుగా ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు.