Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను ఆయన ప్రకటించారు.
డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది. తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ తప్పుడు విశ్లేషణలని జగన్ బ్యాచ్ చేయిస్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేసింది.
ఏపీ ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లగా, తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడింది.
ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగతున్నాయి. వర్షంలోనూ టాప్ గేర్లో నిర్మాణ కార్యకలాపాలు సాగిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తూ.. సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలితీసుకుందని ధ్వజమెత్తారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని స్పష్టం చేశారు.