పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. జైలులో తనకు బీ కేటగిరి వసతులు కల్పించాలన్న అతడు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఆమె ఎంపికై రికార్డు సృష్టించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్కామల నడిపూడి మధ్య నేదునూరు పెదపాలెం వద్ద ప్రధాన పంట కాలువపై రిటర్నింగ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్, ఆర్ అండ్ బి అధికారులపై అయినవిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 22వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.
రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
పంటలకు తక్షణమే నీరు అందివ్వాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులను నెట్టుకుంటూ వారంతా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.