కాకినాడ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫలించింది. పిఠాపురం రైల్వేస్టేషన్కి మహర్దశ పట్టింది. డిప్యూటీ సీఎం ప్రయత్నాల మేరకు 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' పరిధిలోకి పిఠాపురం రైల్వేస్టేషన్ చేరింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
పోలవరం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు లేగదూడలపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో గిరిజనలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాజమండ్రిలో మరోసారి పాలలో కల్తీ నిర్ధారణ అయ్యింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై అధికారులు విచారణ చేపట్టారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ను న్యాయస్థానం రద్దు చేసింది.