రంపచోడవరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి మన్యంలోని గోదావరి పరీ వాహక మంటూరు ఎస్టేటుకు సంబంధించి 1972లో అప్పటి రాజమండ్రి జిల్లా కోర్టు ఇచ్చిన జమిందారుకు ఇచ్చిన అనుకూల తీర్పును అమలుచేయలేమని, ఎ స్టేటులోని ఆరు గ్రామాలను అప్పగించడం కుదరదని రాజమండ్రిలోని ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యా యమూర్తి ఆర్.శివకుమార్ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో ఎస్టేట్ల రద్దు అనంతరం గత 63 సంవత్సరా
కాకినాడలోని జేఎన్టీయూ విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతమంది గొడవలు పెడుతున్నారని, ఏ కుటుంబంలో పుడతామో ఎవరి చేతుల్లోనూ ఉండదని లోకేశ్ వ్యాఖ్యానించారు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ సజీవదహనయ్యాడు.
తిరుమల తిరుపతి దేవ స్థానం లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరి గిన కల్తీ వ్యవహారం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీ సిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మండిపడ్డారు. ఆ పాప ప్రక్షాళనలో భాగంగా అమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవ స్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమం గురువారం నిర్వహించారు.
కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి వైసీపీ హయాంలో చేసిన కుంభకోణంపై సిట్ నివేదికతో వాస్తవం బయటకు వచ్చిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
తుని రూరల్, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): తెలుగు సాహిత్యానికి, తెలు గు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వే టూరి చిరస్థాయిలో నిలిచిపోతారని... వేటూరి కలానికి అన్ని వైపులా పదునుండేదని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. గురువారం కాకినాడ జిల్లా తుని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో వేటూరి సాహితి పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి జయంతి వేడుకల్లో ఈ ఏడాది పంచమదశ (15వ) వేటూరి కవి
చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలతో రక్తమోడుతోంది. గడచిన పదేళ్లలో 25 ప్రమాదాలు జరిగితే 22 మంది ప్రాణాలు కోల్పోగా 65మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 30 కి.మీ మేర ఉన్న ఈ ఘాట్లో ప్రమాదభరితంగా 10 మలుపులు ఉన్నాయి. వాటిలో దుర్గమ్మ గుడి, చైనావాల్, సోకిలేరు
కడియం సబ్ రిజిస్టార్ కార్యాలయంపై గురువారం రాత్రి 8-45 గంట లకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు.
కాటన్ బ్యారేజీ లేని గోదావరి జిల్లాలను ఊహించగలమా..? కష్టమే.. ఆ బ్యారేజీ లేకపోతే ఐదు జిల్లాల్లో లక్షలాది ఎకరాలు బీడువారతాయి.. చెరువులు ఎండిపోతాయి.. గొంతులు తడారిపోతాయి..
కాకినాడలో స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. రాయుడుపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐశ్వర్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.