దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నగర శివారు మండలం కాతేరు ప్రాంతం గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఓ యువతి మృతదేహంతోపాటు కొన ఊపిరితో ఉన్న యువకుడిని మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు.
రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.
రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు.
రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నెల 3న ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమెకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
రాజమండ్రి అప్పారావు రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని యువకులు కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది.
కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే, గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దారిన పోయే దానయ్య చనిపోతే నష్టమేంటని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.