రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
ప్రత్తిపాడు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో కొన్నిరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ముందుకు వెళ్తూ... వెనక్కిమళ్ళుతూ అటవీ అధికారులకు చిక్కడం లేదు. సబ్ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. హనుమాన్ బృందాలు, రెస్క్యూటీంలు పెద్దపులి
అమలాపురం రూరల్, మార్చి 17 (ఆం ధ్రజ్యోతి): బూట్లో దూరిన ఓ తా చుపాము బుసలు కొడుతూ హత లెత్తించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి రుద్రరాజు రామ లింగరాజు నగర్లోని కట్టా త్రినాథ్ ఇంటి వద్ద మంగళవారం రాత్రి తాచుపాము
కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 15 (ఆంధ్రజ్యో తి): ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం జిల్లాలో గృహిణులు పడిగాపులు గాస్తున్నారు. గతంలో బుకింగ్ చేసిన 24 గంటలలోపు డెలివరీ చేసే వారు అయితే ఇప్పుడు 3 నుంచి ఆరురోజులు పడుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 8లక్షల 9వేల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
పాలు తాగి రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకూ15 మంది చనిపోయారు.. కారణం.. కల్తీ..! పాలు తాగి చనిపోతామని ఎవరైనా ఊహిస్తారా! అసలు ఊహించరు.. ప్రస్తుతం ఆహారం పరిస్థితి అలాగే ఉంది..జనం హోటళ్లు.. బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్ల వద్ద క్యూలు కడుతున్నారు.. ఆహా అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు.. తిన్న తరువాత ఏమవుతుందో కూడా ఆలోచించడంలేదు..! సడన్ హార్ట్ స్ట్రోక్లు.. కేన్సర్లు.. బీపీ.. సుగర్.. రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయో చూసుకోవడం లేదు.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తినేస్తున్నారు.. గత నెలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజమహేంద్రవరంలో 20 చోట్ల దాడులు చేస్తే.. అక్కడ విక్రయించే ఆహారం చూసి ఇదా తింటున్నారు అంటూ నివ్వెరపోయారు.. అంత దారుణంగా ఉంది పరిస్థితి.
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయందోళనలు సృష్టిస్తున్న ఈ పులి ప్రస్తుతం శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం.
గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..