పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు.
చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారుల బోటు కోసం కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన IND-AP-E8-MO-135 బోటు ఈ నెల 3న చేపల వేటకు వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగానికి ప్రస్తుతం పునర్జీవం పోస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఏపీలో ప్రతి రోజూ 7000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని మండిపడ్డారు. చెత్త పన్ను వేసినా లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందన్నారు.
కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు.