అమృత్ భారత్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు.
కోడి గుడ్డు రికార్డు.. ఎన్నడూ లేనంతగా ధర పెరిగిపోయింది. ఽధర ఆల్టైమ్ రికార్డుకు చేరుకోవడంతో కోళ్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో మాస్టారికి టెన్షన్ తప్పడంలేదు..
వచ్చే సంక్రాంతి నాటికి అనపర్తి-బిక్కవోలు కెనాల్ రో డ్డు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెనాల్ రోడ్డులో వినాయకుడి ఆలయం వద్ద అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రూ.7.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.
అన్నవరం, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వ్రతవిభాగంలో విధులు నిర్వహిస్తు న్న ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సిఫార
అమలాపురం టౌన్, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై నిత్యం డబ్బుల కోసం తల్లిని వేధించే కుమారుడు అత్యవసరంగా రూ.500 కావాలని అడిగి మద్యం తాగి ఇంటికి చేరుకుని తరువాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెట్ల కాలనీలో జరి
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21 (ఆ ంధ్రజ్యోతి): దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొం దిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహా రి వాజపేయి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్సాయి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రంపచోడవరం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్ ఆశ యాలకు అను గుణం గా ప్రజా సేవ కార్యక్ర మాలు అందించడం లో ఎన్టీఆర్ మెమోరి యల్ ట్రస్ట్ ముం దుంటుందని ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆదివారం అ ల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలో జీఎఎస్ఎల్, జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఎన్టీఆ