Home » Andhra Pradesh » East Godavari
ఈసారి ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో తుస్సుమంది. కొద్దిరోజులుగా జగన్ ప్రకటించే మేనిఫెస్టోపై రకరకాల ఊహాగానాలను ఆ పార్టీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. అభ్యర్థుల ప్రచార సమయంలో కూడా ఓటర్లకు పింఛన్లు భారీగా పెంచుతామని, యువతకు ఉద్యోగాలంటూ నేరుగా చెబుతూ వచ్చారు. తీరా మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఆ పార్టీ వారికే మింగుడుపడడం లేదు.
‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంత పార్టీ ప్రయోజనాలనే పణంగా పెట్టి, అనుభవం ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చినవాడిని.. ఏ ఒక్క కులాలకో పరిమితం కాను. అన్ని కులాల ప్రయోజనాల కోసం పాటుపడతా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించాలి’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ కోరారు.
వైసీపీ నాయకులా మజాకానా.. టక్కు టమార విద్యల్లో ఆరితేరిన వారు.. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చీపు రాజకీయానికి తెరలేపుతున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా మద్యం నిల్వలు తెచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో నిల్వ చేస్తోంది.
సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సభలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక గాలి మాటలుగానే మిగిలిపోయాయి. నిడదవోలు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలతో నిడదవోలు అభివృద్ధి పథంలోకి దూసుకు పోతుందని భావించారు. కాని హామీలు అమలుకు కాకపోవడం వైసీపీ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచిందంటూ ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో పరిపాలన మారాలని, దానికి అన్నివర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని ఉత్తర కోస్తా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు అన్నారు. శనివారం టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూరపనేని చిన్నిలను కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులు తమ మద్దతు తెలిపారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించవ ద్దని, జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని ఎస్ఈబీ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకరయ్య అన్నారు. దేవరపల్లి, నిడదవోలులో ఎస్ఈబీ స్టేషన్న్లను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమ లులో ఉన్నందున అధికారులు అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు.
ఈనెల 29న కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్షో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి రోడ్ మార్గం గుండా బయలుదేరి ఉదయం 11 గంటలకు స్థానిక అచ్చంపేట సెంటర్కు చేరుకుంటారు అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు వెంట రాగా సర్పవరం సెంటర్, భానుగుడి జంక్షన్, మెయిన్రోడ్, జగన్నాథపురం వంతెన, ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా యానాం రోడ్లోని బాలయోగి విగ్రహం వరకు రోడ్షో జరపనున్నారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈనెల 29,30వ తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ శనివారం మీడియాకు తెలియజేశారు.
ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి కోటి రూపాయల విలువైన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటనలో నమోదైన కేసులను నీరుగార్చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కీలక నేతను తప్పించి అతని వద్ద పనిచేసే కార్మికుడిపై కేసు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడితో మద్యం నిల్వలు వెనుక ఉన్న వారిపై కేసు దర్యాప్తు వెళ్లకుండా అడ్డుపుల్ల వేసి కేసులను తారుమారు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దాపురం, ఏప్రిల్ 27: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధికసంఖ్యలో పోటెత్తారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,43,130, అన్నదాన విరాళాలు రూ.48,110, కేశఖండన ద్వారా రూ.12,960 తులాభారం రూ.300 కానుక ద్వారా రూ.8 వేలు వెరసి రూ.3,12,500 ఆదాయం స