మండలంలోని పలు గ్రామాల పరిధిలోని ఆర్అండ్బీ రహదారుల్లో ప్రధాన పంటకాలువలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మండలంలోని వెదురుమూడి ప్రధాన పంట కాలువపై నిర్మించిన పెద్ద వంతెన, బ్రిటీష్ హయాంలో వెదురుమూడిలోని టేకి డ్రైన్పై ఉన్న వంతెనలు రక్షణగోడలు విరిగిపోవడం, ఇనుప ఊచలు తుప్పుపట్టి ప్రమాదభరితంగా మా రడంతో నిత్యం ఆ మార్గాల్లో వంతెనలపై నుంచి వెళుతు న్న బస్సులు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఎప్పుడూ కూలిపోతయో, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.
పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మధ్య వశిష్ఠ నది దిండి-చించినాడ మధ్య నిర్మించిన వారధి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారనుంది. మరో మూడు నెలల వరకు ఈ వారఽధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం 216-ఇ జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటుచేస్తూ ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు, రైతులు ఆందోళనబాట పట్టారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు.
పుష్కరాల పనులు వెంటనే ఆరంభిం చడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆ ర్ఎం) మోహిత్ సోనాకియా ఆదేశించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రౌడీ షీటర్ల కదలికలు అసాంఘిక వ్యక్తుల కార్య కలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశించారు.
కలెక్టరేట్కు కూతవేటు దూరం.. అయినా నాటి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమ లు కావడంలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పారిశ్రామి కం గా, పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది.
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..