జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్(జడ్పీ)లను కూడా పునర్వ్యస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధి మేరకు ఉన్న చిత్తూరు జడ్పీ.. ఇక నుంచి మూడుగా మారనుంది. చిత్తూరుతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ కొత్తగా జడ్పీ కార్యాలయాలు ఏర్పడనున్నాయి.
హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలను కుప్పానికి తెచ్చి గతేడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు జలహారతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కృష్ణాజలాలను హంద్రీ-నీవాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్తూరుకు తెస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తవ్వగా, పెండింగ్ పనుల కోసం రూ.105 కోట్లను కేటాయించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
చైన్స్నాచర్స్ వరుస చోరీలకు పాల్పడుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో నెలరోజుల్లో నాలుగు చోరీలు చేశారు. మరో మూడు విఫలయత్నమయ్యాయి.
రూ.2.48 లక్షల నగదు స్వాధీనం
2మున్సిపాలిటీలు, 8 మండలాల తొలగింపు 193 గ్రామాలు అవుట్... 102 గ్రామాలు ఇన్ రైల్వే కోడూరు సెగ్మెంట్ మొత్తం విలీనం 6 మున్సిపాలిటీలు, 36 మండలాలు, 1080 రెవిన్యూ గ్రామాలతో తుది రూపు 8352.43 చ.కిమీ నుంచీ 7728.63 చ.కిమీలకు తగ్గిన విస్తీర్ణం
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
టన్ను నీలం రూ.1.3 లక్షలు తోతాపురి రూ.1.17 లక్షలు
నెలాఖరులోగా మిగిలిన 60 శాతం పూర్తికి ఆదేశాలు
జిల్లా మొత్తం ఒకే అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ 28 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 774 రెవెన్యూ గ్రామాలు
చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. ఈ ముఠా రాత్రి సమయాల్లో ఇంటి తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతోంది.