• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

తిరుపతిలోనే విజయోత్సవ సభ

తిరుపతిలోనే విజయోత్సవ సభ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీకి పుష్కరకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తిరుపతిలో భారీ విజయోత్సవ సభ జరగనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించతలపెట్టిన ఈ విజయోత్సవ సభలను తిరుపతికే పరిమితం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం పేరిట తిరుపతి, వైజాగ్‌, అమరావతిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ దుర్ఘటన కారణంగా రెండు సభలను రద్దు చేసి తిరుపతిలో శుక్రవారం భారీ బహిరంగ సభ

ఖాకీల అండతో మట్కా

ఖాకీల అండతో మట్కా

కొందరు ఖాకీల అండ. ఒకరిద్దరు నేతల వెన్నుదన్ను. వెరసి 12 ఏళ్లుగా శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా ఆడించాడు కింగ్‌పిన్‌ పద్మనాభం అలియాస్‌ కుప్పయ్య. ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోవడానికి కారణమయ్యాడు. ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని, అతడు నిర్మించిన మట్కా సామ్రాజ్యం నేలకూలింది.

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం

తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన రైస్‌, దాల్‌ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.

హెల్మెట్‌ పెట్టు.. బహుమతి పట్టు

హెల్మెట్‌ పెట్టు.. బహుమతి పట్టు

ద్విచక్ర వాహనాల్లో రక్షణ కవచంలా హెల్మెట్‌ పెట్టుకున్నారు. లక్కీడి్‌పలో బహుమతి పొందారు. ఇలా వారం, నెలకు సంబంధించి ఏడు విభాగాల్లో ఎంపికైన 84 మందికి మంగళవారం చిత్తూరులో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘సురక్షిత చిత్తూరు- మీ భద్రత, మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడారు. ‘ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. జరిమానాల భయంతో కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రాణాల విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్‌ ధరించాలి. హెల్మెట్‌ ధరించిన వారిని ప్రోత్సహించేలా హెల్మెట్‌ పెట్టు.. బహుమతులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టాం’ అని ఎస్పీ వివరించారు.

కాంగ్రెస్ హయాంలో స్కాములు.. మోదీ హయాంలో అభివృద్ధి: ప్రహ్లాద్ జోషి

కాంగ్రెస్ హయాంలో స్కాములు.. మోదీ హయాంలో అభివృద్ధి: ప్రహ్లాద్ జోషి

దేశ క్షేమం కోసం ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ప్రస్తావించారు.

కూటమి సభ వాయిదా

కూటమి సభ వాయిదా

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తిరుపతిలో జరప తలపెట్టిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభపై ప్రభావం చూపింది.మంగళవారం నిర్వహించాల్సిన సభ ఈనెల 12కు వాయిదా పడింది.

టమోటా ధర పైపైకి..

టమోటా ధర పైపైకి..

టమోటా ధరలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. ఆదివారం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం కేజీ రూ.40 పలికాయి. సోమవారం గుర్రంకొండ మార్కెట్లో రూ.46 పలికాయి.

 కలెక్టరేట్‌కు చేరిన బీఎల్వో కిట్లు

కలెక్టరేట్‌కు చేరిన బీఎల్వో కిట్లు

చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- ‘సర్‌’)కు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్వో) కిట్లు సోమవారం కలెక్టరేట్‌కు చేరాయి.

షాక్‌లో కుప్పం టీడీపీ!

షాక్‌లో కుప్పం టీడీపీ!

నియోజకవర్గ బాధ్యతలనుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తొలగింపు కుప్పం టీడీపీని షాక్‌కు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

కృష్ణగిరిలో మామిడి ధర ఎంత?

కృష్ణగిరిలో మామిడి ధర ఎంత?

పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో రైతులకు తోతాపురి మామిడికి చెల్లిస్తున్న ధరపై క్షేత్రస్థాయిలో ఉద్యానవన మార్కెటింగ్‌ బృందాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి