Share News

మదనపల్లె అల్లనేరేడుకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:10 AM

మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్‌ టు బీ మిట్స్‌ యూనివర్సిటీ వీసీ యువరాజ్‌ తెలిపారు.

మదనపల్లె అల్లనేరేడుకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు
దరఖాస్తును ప్రదర్శిస్తున్న ఛాన్సులర్‌ విజయభాస్కర్‌ చౌదరి, వీసీ యువరాజ్‌

కురబలకోట, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి) : మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్‌ టు బీ మిట్స్‌ యూనివర్సిటీ వీసీ యువరాజ్‌ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లెలోని మిట్స్‌-ఐపీఎ్‌ఫసీ మద్దతుతో శ్రీదేవి జామున్‌ సొసైటీతో కలిసి జిఐ ట్యాగ్‌ కోసం చెన్నైలోని సూచికల రిజిస్ర్టీ ఐపీఆర్‌ కార్యాలయంలో అధికారకంగా దరఖాస్తు చేసినట్లు వివరించారు. దీంతో మదనపల్లె అల్లనేరేడుకు ప్రత్యేక గుర్తింపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రో ఛాన్సులర్‌ ధ్వారకనాథ్‌, డీన్‌లు తులసీరామ్‌నాయుడు, శివయ్య, రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:10 AM