శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీ పరిసరాలు, రోడ్లు, కల్యాణకట్టలు, అఖిలాండం, లడ్డూ విక్రయ కేంద్రం వంటి ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి.
జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.
తప్పులులేకుండా పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రాష్ట్ర కమిషనర్ కూర్మనాథ్ సూచించారు.
గ్రామాల బలోపేతమే దేశాభివృద్ధికి పునాది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామసభలు, పంచాయతీలకు మరింత అధికారాలు, బాధ్యతలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు.
కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని.. దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
తిరుపతిలో శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు.
కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హనుమంత, రాత్రి గజ వాహనాలపై ఉత్సవర్లు భక్తులకు దర్శనమిచ్చారు.