జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అదనంగా మరో రూ.1,436కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం పేరిట నిర్మాణ రంగంలో రూ. 1,229కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ పెట్టుబడితో జిల్లాలో 1500ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. అలాగే ఇప్పటికే జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణలో భాగంగా రూ.209కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ పెట్టుబడులతో 35ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. రెండు సంస్థల ప్రతిపాదనలపై బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు రాయితీలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు కొత్తగా రూ.1,436కోట్ల పెట్టుబడులు, 1,535ఉద్యోగాలు రావడానికి అవకాశం ఏర్పడింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వార్షికోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కల్యాణోత్సవం బుధవారం కమనీయంగా నిర్వహించారు.
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని చెప్పి మట్టి, రాళ్లు చేతిలో పెట్టి రూ.15లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
లక్కిరెడ్డిపల్లె, మండలంలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. అమ్మవారు వేకువజామున తన పుట్టినిల్లు చాగలగుట్టపల్లె నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు జాతర ప్రాంతానికి చేరుకుంది.
చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కులవర్ధన్ను కర్మ వెంటాడింది. తాను ఏ విఽధంగా అయితే చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి ఊపిరితీశాడో? అలాగే నీటిలోనే తానూ ఊపిరొదిలాడు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి మహమ్మారి మాత్రం ఆరోగ్యంతో పాటు మానవీయ విలువల్నీ మంటగలుపుతోంది. మృగాలతో కూడా పోల్చలేని స్థాయికి దిగజార్చుతోంది. పసి పిల్లల్ని, పండు ముసలివారిని సైతం కడతేర్చడానికీ వెనుకాడని కసాయి కామాంధులుగా మార్చేస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు మార్చి 9న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు తెలిపారు.
కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాలు తగ్గుముఖం పడుతున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఈసారి మంచి ఫలితాలను సాధించాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వంద రోజుల ప్రణాళికపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జాగ్రతలు పాటించాలంటున్న వైద్య నిపుణులు