Home » Andhra Pradesh » Chittoor
మండలంలోని మోటుమల్లెల పంచాయతీ నగిరిహరిజనవాడలో ఆదివారం రాత్రి ఒక మేక ఆదివారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంగంపల్లె ఎస్టీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నాలుగు వేలు ధర పలికింది కుప్పంలో ఓటు. అధికార పార్టీ రేటు ఇది. ప్రతిపక్ష పార్టీ రూ.2 వేలతో సరిపెట్టింది.
జిల్లాలో సోమవారం జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు మూడువేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి శనివారానికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన సామగ్రిని ఆదివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.
జిల్లాలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో పోలింగ్ సరళి, జయాపజయాలపై అటు ప్రధాన పార్టీల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఫ్యాన్ హోరు స్పష్టంగా వినిపించింది.
ఎన్నికల్లో అధికార పార్టీ నేతల పక్షాన దోపిడీ నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఐదేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని యధేచ్చగా వనరులు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టోకున రూ. వేల కోట్లు పోగేసుకున్నారు. కొన్ని చోట్ల వనరుల దోపిడీకి తోడు అదనంగా వసూళ్ళు, కమిషన్లు, ఇతర దందాల ద్వారా అక్రమార్జన చేకూరింది. విచ్చలవిడిగా వచ్చిపడిన ఆ డబ్బును ఇపుడు అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో వెదజల్లుతున్నారు.
జిల్లాను హోరెత్తించిన ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. పోలింగ్కు ఇక ఒక్క రోజే గడువుంది.
‘జిల్లా విభజన తర్వాత యూనివర్సిటీలన్నీ తిరుపతిలో ఉండిపోయాయి. జిల్లాలో ద్రవిడ వర్సిటీనే ఉంది. ఇక్కడ వర్సిటీనేకాదు ప్రతిష్ఠాత్మక కాలేజీలను నెలకొల్పి చిత్తూరును విద్యా కేంద్రంగా మారుస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.