మదనపల్లె మండలం చిప్పిలిలో శనివారం చిరుత సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. గ్రామానికి చెందిన కృష్ణకిశోర్ పొలంలో చిరుత పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
చెరువుల అభివృద్ధి పనులకు టెండర్ల మొదటి ప్రక్రియ ముగిసింది. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో తొమ్మిది చెరువు పనులకుగాను శనివారం ఫైజ్ బిడ్ ఓపెన్ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు పనుల్లో ఒక్కొక్క పనికి ఐదుగురు పోటీ పడగా, మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో మూడు పనులకు ఒకే ఒక్కరు టెండర్ వేశారు.
మదనపల్లె, జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రధానమైంది.దిగువన ఉన్న రైతులు కొందరు తమకు నీరు అవసరం లేదని, ఆ నీటితో మా పంటలు ఊటు పడుతున్నాయని తూము గేటు మూసేశారు. ప్రస్తుతం మిగిలిన రైతులకు నీరు అవసరం కావడంతో తూము గేటును తీయడానికి రైతులు ప్రయత్నించారు. పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాఫలితం లేకపోవడంతో కొంత పంట ఇప్పటికే ఎండిపోగా, అయిన పంట కూడా గింజలు లేక జల్లు పట్టిపోయింది.
సీఎం చంద్రబాబు ఈనెల 20వ తేదీన మదనపల్లెకు రానున్నారు. జలధార-జలహారతిలో భాగంగా మండలంలోని చీకలబైలు పంచాయతీ కదిరమ్మ, వెంకటమ్మ చెరువులను పరిశీలించనున్నారు.
ప్రధానమంత్రి ఉజ్వలయోజన కింద పేదలకు పంపిణీ చేసే వంటగ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది.
: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కొందరికి అపోహలు ఉన్నాయి. 2002లో ఓటు ఉంటే అప్పటి చిరునామాను ఇప్పుడు ధ్రువీకరించుకోకుంటే జాబితా నుంచి ఓటు తొలగిపోతుందని భయపడుతున్నారు. అవగాహనతో మెలిగితే ఎలాంటి సమస్య ఉండదు. సర్ సర్వే ప్రారంభించడానికి ముందు పాత ఓటర్ల జాబితాను స్తంభింపచేస్తారు. దేశంలో ఎక్కడైనా ఒకచోట ఓటుహక్కు ఉండవచ్చు. ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్తో అవి తొలగిపోతాయి. అందుకే ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉండాలో అక్కడి జాబితాలో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి.
కాణిపాకం శనివారం భక్తులతో కిటకిటలాడిండి. సెలవు దినం కావడంతో జిల్లా నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి వెలుపల వరకు భక్తులు వ్యాపించారు.
చిత్తూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ సూచించారు. శనివారం స్థానిక డీఈవో కార్యాలయంలోని ఏపీసీ చాంబర్లో జిల్లాలోని కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
గృహ లబ్ధిదారులకు బిల్లుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. గూడు సమకూరిందనే సంతోషం వారిలో కనిపించడంలేదు. కాలం గతించిపోతున్నా బిల్లులు మంజూరు కావడంలేదు. ఇల్లు నిర్మించాక వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఆ ఊసెత్తలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు వారంతా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించిన సభ విజయవంతమైంది.