పుంగనూరు నియోజవర్గం గతంలో పుంగనూరు మున్సిపాలిటీ, మండలం, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలన్నీ చిత్తూరు జిల్లాలో ఉండేవి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని ఏకైక మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అని శాప్ చైర్మన్ రవినాయుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్కు నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని అతడి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించాడని, అందువల్ల ఆయన నోట అబద్దాలు తప్ప నిజాలు రావన్నారు.
తిరుపతి రూరల్ మండలం దామినీడులో ఎకరా రూ.2.50 కోట్ల ధరతో ఎకరా భూమిని హైదరాబాదుకు చెందిన ఆలిండియా వెలమ అసోసియేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి గతంలో సంబంధిత అసోసియేషన్ పెట్టుకున్న దరఖాస్తుపై దామినీడు గ్రామం సర్వే నంబరు 200-2లో ఎకరా ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫ్రిబవరిలోనే కమ్యూనిటీ హాల్ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు కేటాయించింది.
శ్రీసిటీలోని క్రియా యూనివర్శిటీ వేదికగా రీజనల్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సమ్మిట్పై ఎంఎ్సఎంఈ డెవల్పమెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్తో వర్చువల్ విధానంలో సమీక్షించారు.
నాయుడుపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద డివైడర్లపైన నక్కలోళ్లు గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒకరైన వెంకటేశ్వర్లు(60) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 పథకం తిరుపతిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం చర్చకు వచ్చింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్పొరేషన్ కార్యకలాపాలను వివరిస్తున్నప్పుడు బంగారు కుటుంబాలకు ఉపాధి విభాగంలో 3 శాతం, ఆర్థిక సహకారంలో 1.6 శాతం సాయమందడాన్ని ఎమ్మెల్యే గుర్తించి ప్రస్తావించారు. మార్గదర్శులు ముందుకు రాకపోవడం వలన వెనుకబడుతున్నామని అధికారులు అంగీకరించారు. సమన్వయం చేసుకుని వారిని ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
జిల్లాలో ఎస్ఐఆర్(సర్) కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. 45 రోజుల పాటు చేపట్టిన సర్వేలో ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైన విషయం తెలిసిందే. 2003 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారిని, మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న వారిని అధికారులు గుర్తించారు. వీరికి ఆయా మండలాల ఏఈఆర్వోలు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత సమయంలో నేరుగా వచ్చి నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేకున్నా ఆన్లైన్లో సమాధానం ఇవ్వాలని దాని సారాంశం.
జిల్లాలో సర్ ప్రక్రియలో ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో లక్షకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలను తప్పులతడకగా నింపారు. ఫలితంగా వారంతా అనామాలిస్ జాబితాలోకి చేరారు. వీరికి బీఎల్వోల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,34,307 మందిని గుర్తించి శుక్రవారం నాటికి 1,23,595 మందికి (92.02 శాతం) నోటీసులు అందించారు. మిగిలిన 10,712 మందికి శనివారం నోటీసులు అందజేసి పూర్తిచేస్తారు.
‘సర్’ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఈ నెలలో నాలుగు రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 23, 29, 30 తేదీలలో జిల్లావ్యాప్తంగా 1708 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు.
పట్టణంలోనిమార్కెట్లో టమోటా ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం 15 కిలోల బాక్సు రూ.300నుంచి రూ.350 వరకు పెరిగింది. తరువాత తగ్గుతూ వచ్చింది. రూ.200 నుంచి ధర రూ.150 నుంచి పలికి రూ.170కి పరిమితమవుతూ వచ్చింది.