శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..
కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్రాజ్ అన్నారు.
కరువు ప్రాంతంగా ఉన్న చిత్తూరులో తాగునీటి కోసం వేసవి రాకముందే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీయార్ జలాశయాన్ని నిర్మించింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే.. వాగుల ద్వారా వచ్చే వరదతో జలాశయం నిండేది. ఒకసారి నిండితే నగరంలోని బోర్లతో పాటు జలాశయం నీటిని ఏడాది వరకు చిత్తూరుకు సరఫరా చేసేవారు. ఒకవేళ సమృద్ధిగా వర్షాలు కురవకుంటే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో శాశ్వత నీటి పరిష్కారం చూపేందుకు 2016లో అప్పటి ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధ అమృత్ పథకం కింద నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థ వాటాతో కలిపి రూ. 250కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు పైపులైన్ పనులను ప్రారంభించారు. ఏడాది పాటు పనులు జరిగాక ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. వైసీపీ ఏం చేసింది? 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి రెండేళ్ల వరకు ‘అడవిపల్లె రిజర్వాయరు’ నుంచి నీటిని తీసుకొచ్చే పనులను గాలికొదిలేసింది. ఈ పనులు చేపట్టకపోతే అమృత్ నిధులు వెనక్కి తీసేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయడంతో.. పనులను ప్రారంభించి తర్వాత వదిలేశారు. ‘కూటమి’ వచ్చాక కదలిక
జిల్లాలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. తిరుచానూరు సమీపంలోని తాజ్హోటల్ వేదికగా సీఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య) తిరుపతి జోన్ వార్షిక సమీక్ష గురువారం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు విస్తృత ప్రోత్సాహకాలు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాకు తిరుపతి, చెన్నై విమానాశ్రయాలతోపాటు ప్రధానపోర్టులు, రైల్వే నెట్వర్క్ ఉందన్నారు. సాగరమాల రోడ్డు ప్రాజెక్టు కింద రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రె్సవేలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.6,500కోట్లకుపైగా రైల్వేప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. హైస్పీడ్ రైలుమార్గాలు జిల్లా గుండా వెళుతున్నాయన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిందన్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో 8,900 హోమ్స్టేలు ఉన్నాయని.. ఇక ఫైవ్స్టార్ హోటళ్లు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని తిరుపతిని డెస్టివేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుంటుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. సీఐఐ రాష్ట్ర చైర్మన్ మురళీకృష్ణ, సీఐఐ తిరుపతి చైర్మన్ జగన్నాథ్ అనిరుధ్ మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించడం శుభపరిణామమని చెప్పారు. ఎలకా్ట్రనిక్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ వంటి ఎన్నో జిల్లాకు వచ్చాయన్నారు. సీఐఐ ప్రతినిధులు నరేంద్రకుమార్, సాంబశివరావు, దామోదర నాయుడు, డాక్టర్ రమాదేవి తదితరులు ప్రసంగించారు. సీఐఐ తిరుపతి జోన్ వైస్ చైర్మన్గా శ్రీనివాస్ ఎంపికయ్యారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో గురువారం శివపార్వతుల గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలకు, రుషులకు ఆదిదంపతులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను అలంకార మండపంలో విశేషంగా అలంకరించి చప్పరాలపై గిరిప్రదక్షిణకు తీసుకెళ్లారు. రాజగోపురం నుంచి శివపార్వతులు చతుర్మాడవీధులోకి ప్రవేశించాక భేరివారి మండపం వద్ద భేరి కులస్థులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. జయరామరావు వీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కైలాసగిరికాలనీ, రాజీవ్నగర్కాలనీ మీదుగా రామాపురం రిజర్వాయరు సమీపానికి చేరుకున్న స్వామి అమ్మవార్లు అంజూరు మండపం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించాక భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.అక్కడినుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమ సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను రాత్రి 8గంటలకు ముక్కంటి ఆలయానికి తీసుకువచ్చారు.కొద్దిసేపు విశ్రాంతి అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడు అశ్వవాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనంపై పురవిహారం చేశారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, సినీనటి శ్రియాచరణ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి దంపతులు, ధర్మకర్తలమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
క్యాబేజి, క్యాలీఫ్లవర్ ధరల పతనంతో రైతులు కుదేలయ్యారు. ఈ సీజన్లో మంచి ధరలు వస్తాయనే ఆశతో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో ఈ పంటలను రైతులు భారీగా సాగు చేశారు. సాధారణ కూరగాయల కంటే క్యాబేజి సాగుకు పెట్టుబడి వ్యయం ఎక్కువే. సంప్రదాయ, రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. నెల రోజులుగా క్యాబేజి ఒక సంచి (35నుంచి 40 కిలోల బస్తా) రూ.200నుంచి 240 ధర పలకడంలేదు. చెన్నె మార్కెట్లో సరైన ధర లేకపోవడం, ఇక్కడి మార్కెట్పైనా ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కూలీల ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతులు విస్తారంగా క్యాబేజి, క్యాలిఫ్లవర్ సాగుకు మొగ్గు చూపారు. దిగుబడి బాగానే వచ్చినా ధరల పతనంతో నష్టాల్లో మునిగిపోయారు.
పంట పొలాలను నాశనం చేస్తున్న పందులను అడ్డుకోవడానికి ఆ రైతు విద్యుత్తు తీగలు లాగారు. చీకట్లో ఆ వైర్లను తొక్కి ఓ వ్యక్తి మృతిచెందారు. ఆ మృతదేహానికి రాయికట్టి పక్కన చెరువులో రైతు పడేశారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ మారేడు గ్రామానికి చెందిన రామ్మూర్తిరెడ్డి(37) బుధవారం రాత్రి కృష్ణాపురం వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఆపి.. శ్రీనివాసులురెడ్డి పొలంలోకి వెళ్లారు. ఆ రైతు పందుల బెడద నివారణ కోసం పెట్టిన విద్యుత్తు తీగలను.. చీకట్లో తెలియక తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే మృతిచెందారు. తన పొలంలో విద్యుత్ తీగల వల్ల రామ్మూర్తిరెడ్డి చనిపోయాడని తెలుసుకున్న ఆ రైతు.. మృతదేహానికి రాయికట్టి సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి పడేశారు. ఎంతకీ రామ్మూర్తిరెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి పొలం వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో వెదికారు. చెరువులో చేయి కనపడటంతో బయటకు లాగారు. రామ్మూర్తిరెడ్డి మృతదేహానికి రాయి కట్టి ఉండటంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని తేలింది. దీంతో వీరు రైతు శ్రీనివాసులురెడ్డిని అనుమానించి.. ఆయన ఇంటికెళ్లారు. గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం రాత్రి సీఐ ప్రసాద్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అదనంగా మరో రూ.1,436కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం పేరిట నిర్మాణ రంగంలో రూ. 1,229కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ పెట్టుబడితో జిల్లాలో 1500ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. అలాగే ఇప్పటికే జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణలో భాగంగా రూ.209కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ పెట్టుబడులతో 35ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. రెండు సంస్థల ప్రతిపాదనలపై బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు రాయితీలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు కొత్తగా రూ.1,436కోట్ల పెట్టుబడులు, 1,535ఉద్యోగాలు రావడానికి అవకాశం ఏర్పడింది.