తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించారు. వారిపై చర్యలకు ఉప లోకాయుక్త సిఫార్సు చేశారు. కర్నూలులోని ఉప లోకాయుక్త జస్టిస్ రజని ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థి నాయకుడి కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ జరిపే వరకు ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు సీడీని తమ ముందు ఉంచాలని వారికి కోర్టు స్పష్టం చేసింది.
పత్రికల్లో, మీడియాల్లో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అలా కాకుండా మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.
ఈట్స్ట్రీట్లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య దుకాణదారులకు సూచించారు.
తిరుపతి బాలాజీ రిజిస్ట్రేషన్ పరిధిలో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. తిరుచానూరు కేంద్రంగా కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవసరమన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి.
సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండగా వేడిగాలులు తోడవుతున్నాయి. దీంతో జనసంచారం లేక వీధులు,బజార్లు బోసిపోతున్నాయి.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మోజో ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తిరుమలలో మధ్య తరగతి భక్తులకు వసతి కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్విండో)లో అక్రమాలకు ఆస్కారం అధికారుల తప్పిదమేనని స్పష్టమవుతోంది.