ఓ పేదవాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా అధికారులు గురువారం నెరవేర్చారు. కలెక్టరేట్ వేదికగా మెప్మా ఆధ్వర్యంలో ఈ-ఆటోను కలెక్టర్ వెంకటేశ్వర్ అందజేశారు.
పీడీ చట్టం కింద నిర్భంధంలోకి తీసుకున్న శ్రీకాళహస్తికి చెందిన మరో యువకుడి ఉదంతాన్ని కూడా సమర్థిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారమే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన హిరణ్ అనే యువకుడి నిర్భంధానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
శాప్ ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిఽధర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రెండు సెషన్లలో లాంగ్వేజ్ పరీక్షలు(తెలుగు/హిందీ/సంస్కృత) నిర్వహించారు.
వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్లు సూర్యుడు నిజంగానే నిప్పులు చెరిగాడు. భానుడి భగభగలతో గురువారం తిరుపతి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. తీవ్రంగా వడగాల్పులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, కేసుల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో తిరుపతిలో పనిచేసి ప్రస్తుతం అనంతపురం వీఆర్లో ఉన్న సీఐలు శ్రీనివాసులు, రామయ్యలను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిముషి బాజ్పేయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందని డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్వో మీటింగ్ హాలులో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి.
ఆలయాలకు విచ్చేసే భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. కాణిపాకంలోని వినాయక సదన్ వసతి గృహంపై 2, 3 అంతస్తులను గురువారం ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచే మంచి క్రీడాకారులను తయారు చేయాలని ఉద్దేశంతో శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తోంది. అవి క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలకు గురువారం చిత్తూరు మెసానికల్ మైదానం జరిగిన ఎంపిక పోటీలే నిదర్శనం. జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో.. సంబంధిత కోచ్లు లేకుండానే ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలైతే మరీ దారుణం.