దేశంలోని పలు నగరాలను కలుపుతూ ఏకంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు
తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి తిరుపతికి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు కృష్ణాపురం మూలమలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. హైవే పక్కన ఉన్న చింత చెట్టును వీరి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీలో రెగ్యులర్ ఈవోలు కుదురుగా కొనసాగలేకపోతున్నారు. ముఖ్యంగా 2019 తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆరేళ్ళ వ్యవధిలో నలుగురు రెగ్యులర్ ఈవోలు మారారు.
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో ప్రకటించిన పలు నిర్ణయాలు జిల్లాకు గణనీయమైన ప్రయోజనాలు కలిగించనున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్న పులికాట్ సరస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
పదవులిచ్చాం.. ఇప్పుడు జాతకాలు చూస్తున్నాం కుప్పం నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో చంద్రబాబు
ఎన్డీబీబీ నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు..
2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు..
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
మంచి పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం 18వ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.
వైసీపీ నేత అంబటి రాంబాబు కన్నా ఆంబోతు నయమని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజకీయాన్ని కలుషితం చేస్తూ గొడవలు, హత్యలకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై సోమవారం తిరుపతిలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి.