జిల్లాలో శనివారం రంజాన్ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.
నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.
ఎస్ఆర్పురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన అశ్విని, ప్రకాష్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దోడు ఆరోగ్యంగా ఉన్నా.. రెండేళ్ల వయసున్న దర్శన్ లంగ్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు. డ్రైవర్ పనిచేసే ప్రకాష్, గృహిణి అశ్విని, ఇప్పటికే రూ.8-రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. వేలూరు సీఎంసీలో చూపించగా, వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంచనా వేశారు.
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలో వైభవంగా జరిగాయి.తుడా కార్యాలయం పక్కనున్న కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు.కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర రెడ్డి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి పుష్పపల్లకిపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.ఉగాదిని పురస్కరించుకుని ఉదయం కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది.సాయంత్రం కేటీ మండపంలో ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించాక వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు
స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి గురువారం సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఉగాది కావడంతో వందలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేశారు. ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించడానికి ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ కృషి చేశారు.
జిల్లాలో గురువారానికి 37,478 మంది గ్యాస్ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుని వేచి ఉన్నారు. గ్యాస్ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళన.. రీఫిల్ సిలిండర్ ఎప్పుడు వస్తుందోనన్న టెన్షన్తో ఉగాది పండగ జరిగిపోయింది. రంజాన్ను ఈ ఆందోళన వెన్నాడుతోంది. గతంలో 24 గంటల్లో డెలివరీ చేసేవారు. ప్రస్తుతం 4-7 రోజుల సమయం తీసుకుంటున్నారు. శుభకార్యాలకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ నిర్వాహకులు సైతం వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 42 మంది గ్యాస్ ఏజెన్సీదారులుండగా 5,09,147 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డొమెస్టిక్ 5,02,905, వాణిజ్య సిలిండర్లు 6242 ఉన్నాయి.
తప్పుల తడకగా కాకుండా కచ్చిత ఆధారాలతో ప్రతి వర్షపు చినుకును లెక్కించేలా ఆటోమేటిక్ వెదర్స్టేషన్లను అధికారులు అప్డేట్ చేశారు
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయంలో సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు.