విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో బాలికను వంచించాడు. మూడేళ్లుగా మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది.
ప్రతి ఇంట ఒక ఐటీ నిపుణుడు. - ఇదీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆలోచనా విధానం. ఈ కార్యక్రమం ఎంత సత్ఫలితాన్నిచ్చిందో చూశాం. మరిప్పుడు.. ప్రతి ఇంటిలో పారిశ్రామిక వేత్త ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం ఇది. దీని కార్యరూపం దాల్చేలా సీఎం, మంత్రి నారా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
రెండు ఎంఎ్సఎంఈ పార్కుల అభివృద్ధికి.. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి.. దమ్ము బయో ఫ్యూయెల్స్ ప్లాంట్.. ఈ మూడింటికి మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
చిత్తూరు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న సావిత్రికి జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో పనిచేసిన కాలంలో ఆమె కింది ఉద్యోగుల నుంచి లంచాల కోసం పీడించినట్లు ఆరోపణలొచ్చాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా వరసిద్ధుడి ఆలయంలో విశేష ద్రవ్యాహుతిని వేదపండితులు మంగళవారం వైభవంగా నిర్వహించారు.
పదో ఆలిండియా పోలీసు జూడో క్లస్టర్-2025 క్రీడల్లో చిత్తూరు కానిస్టేబుల్ షంషీర్ ప్రతిభ చూపాడు. జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్లో గతనెల ఎనిమిది నుంచి 13వ తేదీవరకు జరిగిన క్రీడల్లో పెన్కాక్ సిలాట్ విభాగం 60 కిలోల కేటగిరీలో షంషీర్ మూడోస్థానంలో నిలిచి.. కాంస్యపతకాన్ని సాధించాడు.
వాటర్ షెడ్ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో మన జిల్లా.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ‘జన్భాగ్దారి’ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం గుంటూరులో నిర్వహించిన వాటర్ షెడ్ నేషనల్ లెవల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా ఈ అవార్డును డ్వామా పీడీ రవికుమార్,ప్రాజెక్టు అధికారి శోభారాణి అందుకున్నారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.చిత్తూరు రూరల్ మండలం ఫైవ్ వెంకటాపురంలోని 68 ఎకరాల్లో రూ.14.30కోట్లతో తలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కుకు మంగళవారం ఆయన వర్చువల్గా భూమిపూజ చేశారు.
పుత్తూరు నుంచి తిరుత్తణి వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.రహదారి పనులు ఒక వైపు జరుగుతుండగా వాహన రాకపోకలు సాగుతున్నాయి.దీంతో రహదారి ఇరుకుగా మారడంతో అమిత వేగంతో వెళ్లే వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.