సీటీఎంలో మంగళవారం జరిగిన నలవీర గంగాభవానీ అమ్మవారి జాతర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మొదటిది. ఏటా జాతర సంరంభం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత అంతటా జాతర నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయల్దేరిన విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్నకు గురయ్యారు.
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.
నాగలాపురం మండలం కృష్ణాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
కల్తీ జరగలేదని చెప్పటానికి వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉందా అని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సవాల్ విసిరారు.
తిరుపతిలో ఎంతో ప్రాశస్త్యం కలిగి.. కనుమరుగైన దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేసి.. లేక్ తిరుపతిగా తయారు చేయడానికి తుడా అధికారులు మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కోసం తిరుపతిలో ఏర్పాటైన సిట్ కార్యాలయం త్వరలో ఖాళీ అవనుంది.
చిన్న వయసులోనే పిల్లలను కంటి సమస్యలు వేధిస్తున్నాయి.