మోహన్బాబు యూనివర్శిటీ కేంద్రంగా తరచూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. విద్యార్థుల నుంచీ అధిక ఫీజులు వసూలు చేశారని గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ వర్శిటీకి భారీగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంబీయూ హైకోర్టును ఆశ్రయించింది.
గ్రామాణాభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. పన్నుల వసూలు, శానిటేషన్ తదితర అంశాలపై ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు.
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లు ఇకపై ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఓపీలను చూడాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ నియమించిన విచారణ కమిటీ మంగళవారం ఆయన్ను విచారించింది.
సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ మంగళవారం పలు ఆలయాలను దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారిని ఉదయం తోమాల సేవలో దర్శించుకున్న ఆయన తరువాత శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని రాహుకేతు పూజలు చేశారు.
సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.50 వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు చెప్పారు.
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇకపై డిజిటల్ లెర్నింగ్ నేర్పించాలని దృష్టి యాప్ స్టేట్ కీ రిసోర్స్ పర్సన్ టీం సభ్యులు వైరముత్తు, వైషాఖ్ పేర్కొన్నారు.
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎ్ఫ)లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1143 మట్టి నమూనాలు సేకరించినట్లు ఎన్ఎంఎన్ఎ్ఫ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ తెలిపారు.