• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి

రామసముద్రం ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రెడ్డెయ్య ఆదివారం మృతి చెందారు. కలకడ మండలం పోతువారిపల్లెకు చెందిన ఆయన ఆదివారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.

కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

ఎన్నారై టీడీపీ అధ్వర్యంలో కువైట్‌లో ఆదివారం ఎన్టీఆర్‌ 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా!

ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా!

ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ గంటలో అత్యవసర చికిత్స అందితే 25 శాతం బాధితుల ప్రాణాలు నిలుస్తాయని వైద్యులే చెబుతారు. సాధారణంగా రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ఈ తరహా వైద్యసేవలు ట్రామా సెంటర్‌లో లభిస్తాయి.

మరిన్ని చిక్కుల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే

మరిన్ని చిక్కుల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే

ఇప్పటికే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో వివాదంలో ఇరుక్కున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తాజాగా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు పబ్బుల్లో మహిళల గురించి, ముస్లిం మహిళల గురించే కాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు గురించి సైతం అసభ్యంగా మాట్లాడిన వీడియోలు వెలుగు చూడడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరమైన ఆయన తాజా పరిణామాలతో క్యాబినెట్‌ హోదా కలిగిన అసెంబ్లీ విప్‌ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.

గ్రామీణ వైద్యంలో విప్లవం

గ్రామీణ వైద్యంలో విప్లవం

గ్రామీణ ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. యాదమరిలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీలో సంజీవని డిజిటల్‌ సేవలు, ఓపీ నమోదు, మందుల పంపిణీ దాకా పరిశీలించారు. పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌ (పీసీసీ) డెస్క్‌ వద్ద జరిగే నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌, విజిట్‌ రికార్డులు, జనరేషన్‌, పేషెంట్‌ మ్యాపింగ్‌ విధానాన్ని సిబ్బంది సీఎంకు వివరించారు.

ఈ ఏడాదే   ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ఈ ఏడాదే ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన నాగరాజు(52)పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయపురం మండలంలోని ఓ దళితవాడకు చెందిన నాగరాజు.. స్థానికంగా ఉన్న ఓ చిన్నారికి మామిడి పండు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపు వేసి లైంగిక దాడికి పాల్పడగా, చిన్నారి ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె ఏడుపును పసిగట్టిన తల్లి వెళ్లి తలుపు తీసి చూడగా నాగరాజు వికృత చేష్టలు బయటపడ్డాయి. అతడికి దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేశారు. పరారీలోని నిందితుడిని అదుపులోకి తీసుకొని శనివారం రిమాండుకు తరలించారు.

సర్వదర్శనానికి 24 గంటలు

సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అన్నీ ఉన్నా ఏవీ లేవట!

అన్నీ ఉన్నా ఏవీ లేవట!

తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి