మొక్కు తీర్చుకోవడానికి తమ కుటుంబంతో పాటు సోదరి పిల్లలనూ తీసుకుని సతీష్ తిరుమల బయలుదేరారు
సహకార సంఘాల్లో పాతికేళ్లకు మించి పని చేస్తున్న వారికి ఇప్పుడు కఠిన ‘పరీక్ష’ ఎదురైంది
కోడె గిత్తలు పౌరుషం చూపాయి. తమను పట్టుకోవడానికి వచ్చిన వారి నుంచి తప్పించుకుని పరుగు తీశాయి.
తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రహదారులు, విద్య, పరిశ్రమలు, నీటి సదుపాయాల వంటి పలు రంగాల్లో కీలక ప్రగతి సాధించామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో సామాన్యుడిలా గడిపారు. నుదుట తిరునామం, భుజంపై కండువా, పంచె,చొక్కాతో మనవడి చేయిపట్టుకుని ఆయన ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే వెసులుబాటున్నప్పటికీ భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, కుమారుడు లోకేశ్తో కలిసి క్యూలైన్ ద్వారానే శనివారం ఉదయం 6.40 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు, టీటీడీ ఈవో రవిచంద్ర, ఏఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవీణ మరోసారి ఆరోపణల దాడి చేసింది. సామాజిక మాధ్యమాల్లో శనివారం ఆమె ఆరోపణల వీడియో వైరల్ అయింది.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో తిరుపతిలోని ఇందిరా మైదానంలో శనివారం ఉదయం ప్రారంభమైంది.జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆటో ఎక్స్పోను పలు వాహనాలను పరిశీలించారు.స్టాళ్ల నిర్వాహకులు వాహనాల ప్రత్యేకతలను ఆయనకు వివరించారు.
చిత్తూరు, కుప్పంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో సోమవారం నుంచి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. చిత్తూరులోని సిల్క్ సెంటర్, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విద్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బిల్లుల పెండింగ్పై సభ్యులు నిలదీశారు. అధిక శాతం పీఆర్, ఎన్ఆర్ఈజీఎ్సలోనే పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఈసారి కూడా మెజారీటీ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. షోకాజ్ నోటీసులు అందజేసినా తీరు మారలేదు.
స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. శనివారం సాయంత్రం ఆయన అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, పట్టణ వాసులు అశ్రునయనాలతో పాల్గొన్నారు. దివంగత నాయకుడికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, చిత్తూరు బీజేపీ నాయకులు చిట్టిబాబు, పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు నరసింహులు, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు ఆనందబాబు, కార్యదర్శి నారాయణ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.