తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఎబోలా వైరస్పై జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
‘తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన కరుణాకర రెడ్డి వ్యవహరిస్తున్నారు. తక్షణం కోట్లాదిమంది హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి’ అని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించాలని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 20వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు.
డీడీ చెల్లించాక అదనంగా డబ్బులిస్తేనే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బంది టీసీ బుక్కులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వడగాడ్పులు వీస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై జనం విలవిల్లాడిపోతున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో గణకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి పెద్ద కొన్ని ప్రశ్నలకు సర్వేకు సంబంధించి జవాబు దాటేస్తుంటే మరికొన్ని చోట్ల డోర్ నెంబరు కలిగి శాశ్వతంగా, తాత్కాలికంగా మూతపడ్డ ఇళ్లతో సమస్యలు తీవ్రమవుతున్నాయి.
కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు.
రామకుప్పం మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెద్దూరు, ననియాలతండా, వీర్నమల, పెద్దతండా, గుట్టూరుతండా, చిక్కలపల్లె తండాల్లో ఉరుములు, మెరుపులతో గంటపాటు వాన కురిసింది.
పీలేరు మండలం వేపులబైలు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మంజునాథ్(46) మరణించాడు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్కు చెందిన మంజునాథ్ కొన్నేళ్లుగా సదుం మండలం తుమ్మగుంటపల్లెలో కాపురం ఉంటూ స్థానిక రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.