తిరుపతి నుంచి విశాఖ వెళ్లే ప్రత్యేక ఎక్స్ప్రెస్(08548) ఏసీ కోచ్లో పొగలు వచ్చాయి. ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.
అలిపిరిలో కూలిపోయే స్థితిలోవున్న పాదాల మండపం ప్రాచీనవైభవం చెక్కుచెదరకుండా పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. గురువారం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎ్సఐ) అధికారుల బృందం దీనిని పరిశీలించింది. ప్రత్యేక శ్రద్ధతో, శ్రాస్తీయ పద్ధతిలో అవే రాళ్లు, స్తంభాలు వినియోగించే మండపాన్ని పునర్నించవచ్చని ఏఎ్సఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలోని బృందం అభిప్రాయపడింది.
బ్యాకింగ్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువకానుంది. బ్యాంకు సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల బ్యాంకర్ల సమితిలను(ఎ్సఎల్బీసీ) ఆదేశించింది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక శాఖ లేదా బ్యాంకింగ్ సేవా కేంద్రం, ఏటీఎం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు జారీచేసింది.
పేదలు పక్కా ఇండ్లను నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందించనుంది.అర్హుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది. జాబితా సిద్ధమయ్యాక కేంద్ర ప్రభుత్వ వాటాకు, రాష్ట్ర వాటా కూడా జత కానుంది. రాష్ట్ర వాటా నయాపైసా ఇవ్వని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి పేదలు తీవ్ర ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం, జనాభా ప్రాతిపదికన పంచాయతీలను బలోపేతం చేయడానికి సచివాలయ వ్యవస్థను హేతుబద్దీకరిస్తున్నారు.నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను విభజించారు. పంచాయతీ కార్యదర్శులు ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
తిరుమల రెండో ఘాట్లో కొత్త రోడ్డు వేసి మూడు నెలలు కాకముందే గుంతలయమైంది. భారీ వర్షాలు, అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలతో కొద్ది నెలలకే మరమ్మతులకు గురైంది.
గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. స్మగ్లింగ్కు గురికాకుండా ఎర్ర చందనాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
శేషాచలంలో పెద్దపులి కోసం తొలిసారి అన్వేషణ మొదలవుతోంది.
శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,20,13,724 వచ్చింది
జిల్లావ్యాప్తంగా పండుగలా గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు.