మదనపల్లె జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలని డీఎ్సడబ్ల్యూవో దామోదర్రెడ్డి పేర్కొన్నారు.
టమోటా పంటకు వినియోగించే డ్రిప్ ఎరువులను కొందరు మోసగాళ్లు ప్రముఖ కంపెనీ పేరుతో దుకాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్న సంఘటన వెలుగులో చూసింది.
చిత్తూరు జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా ఇంటి పన్ను డిమాండ్లో అసలు చెల్లిస్తే, ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయినా 25 రోజుల్లో డిమాండ్లో రూ.5 కోట్లు మాత్రమే వసూలైంది.
జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇళ్ల గణన 88 శాతంపైగా పూర్తయింది. సర్వే పూర్తి కాని ఇళ్లకు ఆ సంఖ్య ఉండడం లేదు. ఈక్రమంలో జనగణన అధికారి ఇంటికి రాకపోతే వెంటనే 0857224273, 0857224274 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు.
చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సబ్సిడీపై వీటిని పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు వారం పదిరోజులుగా చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఖరీ్్ఫలో ఎల్నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో మాత్రం ఈవర్షాదార పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండ విజృంభించినా సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వాన కురిసింది. చిత్తూరు నగరంతో పాటు పరిసర మండలాల్లో హోర్డింగులు గాలికి ఎగిరిపడ్డాయి. భారీవృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గంటన్నర పాటు వర్షం కురిసింది.
టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేసుకున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ స్కాంలో అక్రమ నగదు చలామణి, హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది.
అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.