ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.భాస్కరుడిని పదవి నుంచి తొలగిస్తూ వీసీ రాణిసదాశివమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. సాయంత్రం అలిపిరి నుంచి నడక మార్గంలో ఆమె రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
ఇదో అరుదైన చేప..తైవాన్ దేశంలో దీనిని అదృష్ట చేపగా భావించి ఇండ్లలో పెంచుకుంటుంటారు.పేరు అరోవణ.. ఫసిఫిక్ మహాసముద్రంలో దొరికే ఈ చేప కేజీ నుంచి 1.5 కేజీల వరకు పెరుగుతుంది.
ఆన్లైన్లో పెళ్లి సంబంధం వెతుకుతున్న యువకుడికి ఓ యువతి పరిచయమైంది. ట్రాప్ చేసి తన ఖాతాకు డబ్బు జమ చేయించుకుని మోసం చేసింది.
ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకు తమ భూములిచ్చేది లేదని గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామస్తులు తెగేసి చెప్పారు. గ్రామసభ నిర్వహంచడానికి వీల్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
కని, పెంచిన బిడ్డ తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. బతికుండగానే తమ కుమార్తె చిత్రపటానికి నివాళులర్పించి, కర్మక్రియలు జరిపారు.
కాణిపాకంలో గురువారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు భక్తుల చేత వైభవంగా నిర్వహింపజేశారు. ఉదయం మూల విరాట్కు అభిషేకం చేశాక ఆస్థాన మండపంలోని వేదికపై సిద్ధి, బుద్ది సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేషపూజలు నిర్వహించారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం ఆరాటపడుతోంది. బలమైన నాయకత్వం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో మరీ బలహీనంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర’లో భాగంగా శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.