• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

దోపిడికి వచ్చి దారుణ హత్య

దోపిడికి వచ్చి దారుణ హత్య

దోపిడీకి వచ్చి కాపలాదారును హతమార్చిన సంఘటన కలకలం రేపింది. చిత్తూరు మండలం మంగాపురంలో జరిగిన ఈ వైనంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమోరికాలో స్థిరపడ్డారు. ఇక్కడ పెద్ద నివాసభవనం ఉంది. పొలాలు కూడా ఉన్నాయి.

తిరుపతి సోనోవిజన్ షాపులో రూ.2 కోట్ల విలువైన ఫోన్ల చోరీ

తిరుపతి సోనోవిజన్ షాపులో రూ.2 కోట్ల విలువైన ఫోన్ల చోరీ

తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 50 యాపిల్ ఐఫోన్లు, ఇతర కంపెనీలకు చెందిన మరో 200 సెల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు.

 నేత్రపర్వం....తెప్పోత్సవం

నేత్రపర్వం....తెప్పోత్సవం

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.

మత్తులో యువత చిత్తు

మత్తులో యువత చిత్తు

మదనపల్లె, రాయచోటి కేంద్రాలుగా గంజాయి విక్రయాలు అరకు, బిహార్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి దిగుమతి అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న నేరాలు

కుప్పం రైతులకు వన్‌టైమ్‌ జాక్‌పాట్‌!

కుప్పం రైతులకు వన్‌టైమ్‌ జాక్‌పాట్‌!

143 మంది అధీనంలోని 178 ఎకరాలకు రూ.12.44 లక్షల చొప్పున పరిహారం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు

పేలిన నాటు తుపాకీ

పేలిన నాటు తుపాకీ

పొలాల్లో రైతు దారుణ హత్య ఆస్తికోసమే దారుణమంటున్న మృతుడి కుటుంబ సభ్యులు

బిల్లులకు డిజిటల్‌ చెల్లింపులే

బిల్లులకు డిజిటల్‌ చెల్లింపులే

16వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో పారదర్శకతకు చర్యలు

వందేభారత్‌ ట్రయల్స్‌

వందేభారత్‌ ట్రయల్స్‌

తమిళనాడు లోని శ్రీపెరంబదూరులో అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వందేభారత్‌ రైలు మంగళవారం సాయంత్రం రేణిగుంట నుంచి తిరుపతికి దూసుకెళ్తూ కనిపించింది. ముందు, వెనుక కో ఫైలట్లు మినహా ఖాళీగా వచ్చిన ఈ రైలు మెయిన్టనెన్స్‌ కోసం రైల్వేస్టేషన్‌లోని ఫిట్‌లైను మీద ఆగింది.ముందు, వెనుక ఇంజన్లు, ఎనిమిది బోగీలు, వైట్‌ అండ్‌ బ్లూ కలర్స్‌తో సరికొత్తగా చూపరులను ఆకట్టుకుంది.ట్రయల్స్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన ఈ రైలు త్వరలోనే పూర్తిస్థాయిలో పట్టాలెక్కనుందని సమాచారం.

ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం

వి.కోట మండల పరిధిలోని బెంగళూరు- చైన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేలో మంగళవారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో సాఫ్ట్‌వేరు ఇంజనీర్లుగా పనిచేస్తున్న అక్కాచెల్లెళ్ళు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వి.కోట ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన ప్రకారం.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లె పంచాయతీ బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య మానస(35), మరదలు, గౌతమి(32).. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. వీరు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. వచ్చే దారిలో బట్టరహళ్లి జంక్షన్‌ వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్ర వీరిని లిఫ్ట్‌ అడిగి.. కారులో ఎక్కారు. డ్రైవింగ్‌ చేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి పక్కన పరంధామరెడ్డి.. వెనుక సీట్లో మానస, గౌతమి, జ్ఞానేంద్ర కూర్చున్నారు. వీరి కారు బెంగళూరు-చైన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేలో వి.కోట మండలం రామాపురం సమీపానికి చేరుకోగానే.. అక్కడ అదపుతప్పి ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై గౌతమి అక్కడికక్కడే మృతి చెందారు.

రేపట్నుంచీ 5కేంద్రాల్లో టెట్‌

రేపట్నుంచీ 5కేంద్రాల్లో టెట్‌

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం నుంచి 21వతేదీ వరకు జరగనున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి