వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు.
జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.
ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు. గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు పంచుతారు’ అని నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన ఆమె, తొలి రోజైన మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యంలలో మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు
లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ లెక్కన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే 7 స్థానాలు పెరిగి 21 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తిగా, రెండు పాక్షికంగా ఉన్నాయి.
చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్రిజిస్ట్రార్ (ఎస్ఆర్) కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ఏసీబీ అధికారులు దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ 24 గంటలపాటు ఏసీబీ అధికారులతో పాటు ఎస్ఆర్ కార్యాలయ సిబ్బంది, 15 మంది డాక్యుమెంటు రైటర్లు కార్యాలయంలోనే ఉన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కుటుంబీకులు మాత్రలు తీసుకొచ్చినా అనుమతించలేదు.
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన కంపెనీకి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుపై దాఖలు చేసిన పిటిషన్ను, ఏపీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో వాటర్ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్తును వినియోగిస్తున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ రవాణా ఆగిపోయింది.ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30వేలకు పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్సన్లున్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.