మహాశివరాత్రి రోజున శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలు చేస్తామంటూ ఇన్స్టాగ్రామ్లో దేవధాం యాప్ పేరుతో ప్రచారం జరిగింది. ఈ వివరాలు సేకరించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది..
చిత్తూరుకు జంట ఏనుగులు వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సంతపేటలోని బుడమలచెరువు సమీప కాలనీ ఇళ్ల వద్దకు చేరాయి.
కార్వేటినగరం మండలం ఆర్కేవీబీ పేట పంచాయతీ ఇందిరాకాలనీలోని కోళ్లఫారంలో ఆదివారం వందలాదిగా కోళ్లు చనిపోయాయి. ఈ విషయం కలెక్టర్ సుమిత్కుమార్ దృష్టికి వెళ్లడంతో తక్షణ చర్యలకు ఆదేశించారు.
కూలి పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిన రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. 15మంది గాయపడ్డారు.
తమ భూములను పూతలపట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో వారు నిరసన వ్యక్తం చేశారు.
బర్డ్ఫ్లూతో నష్టపోయిన పౌలీ్ట్ర రైతులకు పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదివారం ప్రకటించారు. సదుం మండలంలోని పుత్తావారిపల్లెలో రెండు కోళ్లఫారాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకిందని, మృతి చెందిన కోళ్లను ప్రత్యేక పద్ధతిలో ఖననం చేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు.
హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిస్ర్టిక్ట్ హర్బ్టేజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉషశ్రీ ఐదుగురు డాక్టర్లతో కలిసి బీపీ, షుగర్, ఆర్బీఎస్ తదితర పరీక్షలు చేశారు.
కురబలకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రాత్రింబవళ్లు దర్జాగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటోంది.
కష్టపడి పనిచేస్తేనే ప్రతిఫలం దక్కుతుందని బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి వద్ద ఉన్న తిరుపతి ఐసర్లో వారం రోజులపాటు నిర్వహించిన అడ్వాన్స్డ్ అకౌస్టిక్స్ వర్క్షా్పఆదివారంతో ముగిసింది. న్యూయార్క్కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కె లిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయో అకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనులు, అధ్యాయనాల గురించి పరిశోధకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.