• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

ROAD: కంకర  తేలిన కష్టాల బాట

ROAD: కంకర తేలిన కష్టాల బాట

డి. హీరేహాళ్‌ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొవ్వూరునగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చీపురు పట్టి..చెత్త ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటా పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

రైతులకు అండగా ముఖ్యమంత్రి

రైతులకు అండగా ముఖ్యమంత్రి

: సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు.

ఇక యమస్పీడ్‌గా రాజధానికి..!

ఇక యమస్పీడ్‌గా రాజధానికి..!

అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుతం రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం భారంగా మారింది.

శుభగడియలొచ్చాయ్‌

శుభగడియలొచ్చాయ్‌

పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు శుభమూహుర్తాలకు బ్రేక్‌ పడింది.

TALENT:  ప్రతిభకు ప్రోత్సాహం

TALENT: ప్రతిభకు ప్రోత్సాహం

కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్‌ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.

HELP: అనాథ చిన్నారులకు చేయూత

HELP: అనాథ చిన్నారులకు చేయూత

అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ రవిశంకర్‌ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్‌, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు.

WORKS: రూ. 27 లక్షలతో తాగునీటి పనులు

WORKS: రూ. 27 లక్షలతో తాగునీటి పనులు

డి. హీరేహాళ్‌ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్‌బబ్ల్యూఎస్‌ ఏఈ ధనుంజయ గౌడ్‌ తెలిపారు.

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌

యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు.

AADHAR: ఆధార్‌ అవస్థలు

AADHAR: ఆధార్‌ అవస్థలు

మండలకేంద్రంలో ఆధార్‌కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్‌ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి