మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.
సర్వే ద్వారా కుష్ఠు బాధితులను గుర్తించాలని స్టేట్ శాంపిల్ సర్వే అధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు
కేంద్రప్రభుత్వం 2021 డిసెంబర్లో ఇచ్చిన జీవో ప్రకారం పంటల మద్ధతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు డిమాండ్ చేశారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గురు ఉపాధి హామీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.
స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇసుక, మట్టి అమ్ము కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇసుక, మట్టి అమ్ముకున్నారో.. వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? ’ అని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బహిరంగ సవాల్ విసిరారు.
సర్దార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చ్ (ఐక్యత కోసం పాదయాత్ర) కార్యక్రమాన్ని పట్టణంలో మంగళవారం నిర్వహించారు.