పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. పట్టణంలోని జయంతి రాధాకృష్ణయ్యశెట్టి కల్యాణ మం డంపంలో ఈ నెల 22వ తేదీన చేపట్టే ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మండలంలోని కర్ణాటక సరిహద్ధులో ఉన్న గో విందవాడ గ్రామంలో నాసిరకం పురుగుమం దుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఓ ఫర్టిలై జర్ దుకాణంలో సెకండ్ సేల్ పేరుతో బయో కంపెనీలకు చెందిన పురుగుమందులను కర్ణాట క రాష్ట్రంలోని కంప్లి, కురుగోడు, గంగావతి ప్రాంతాల నుంచి అక్రమంగా దిగమతి చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు.
పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు.
ప్రజల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములు ప్రస్తుతం ఉపయోగంలో లేక వెలవెలబోతున్నాయి. రైతుల నుంచి కొ నుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరచడం, అత్యవసర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం లక్ష్యంగా ఈ గోదాములను నిర్మించారు. అయితే నిర్వహణ లోపం వల్ల అవి క్రమంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.
రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని.. లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.