మండలంలోని ఆర్బీ వంక, మల్లాపురం, పల్లేపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కురవడంతో పంట కుంటలు, చెక్డ్యాంలలో నీరు చేరి కళకళలాడాయి.
సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డి. హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్ కెనాల్ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.
పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.
ఏడాది కాలంలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భేష్ అనిపించుకున్నాడు నాగులగుడ్డంతండా గ్రామానికి చెందిన హరీష్ నాయక్.
అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు.
స్థానిక మండల పరిషత కార్యాలయంలో సోమవారం జరగవలసిన ఉపాధిహామి పథకం పనులు పూర్తిగా స్తంభించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టడంతో కూలీల బిల్లులు, కొలతల ప్రక్రియ నిలిచిపోయింది.