మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామ సచివాలయం.
పట్టణంలో తిష్టవేసిన తాగునీటి, చెత్త సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.
కుందుర్పి నుంచి జంబగుంపల, కొలిమిపాళ్యం వరకు నాబార్డు ద్వారా రూ. రెండు కోట్లతో నిర్మించిన ఆరు కిలోమీటర్లు తారు రోడ్డును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ శుక్రవారం ప్రారంభించారు
చంద్రబాబు నాయకత్వంలోని ఎనడీఏ కూటమి పాలనలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే, విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
మండలంలోని రాయలచెరువులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మించారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు.
సమస్యల పరిస్కారం కోసం ప్రజాగ్రీవెన్సులో ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణ పరిస్కారం చూపాలని సంబంధిత అదికారులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్లాయంలో నిర్వహించిన ప్రజాగ్రీవెన్సులో ఎమ్మెల్యే, మాజీమంత్రి నియోజకవర్గ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.
అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది.