COLLEGE: జీవ వైవిధ్యంపై ముగిసిన సదస్సు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:51 PM
పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్ బోటనీ విభాగం ప్రొఫెసర్ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు.
గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్ బోటనీ విభాగం ప్రొఫెసర్ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు. ఇతర జీవరాసులు అంతరించే ప్రమా దం ఉందన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న ఆధ్యాపకులకు, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, ఆధ్యాపకులు బీమలింగయ్య, రవశంకర్ శర్మ, జమీల బీబీ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....