ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.
పట్టణంలోని గంగా నగర్, హనుమేష్ నగర్లో శనివారం కలెక్టర్ ఒ. ఆనంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్యకంగా కలిశారు.
బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యాపారా లు సాగిస్తున్న చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో తాడిపత్రి టౌనబ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని సంకల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో చర్చించామన్నారు. ఆయన శనివారం పట్టణంలోని మార్కెట్యార్డు నుంచి బస్టాండ్ వరకు మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చిరువ్యాపారుల తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై వారికి అవగాహన కల్పించారు.
మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో రావాలని ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. మండలంలోని జంగమరనహళ్లి, ముక్కడంపల్లి, పూలపల్లి, దాసేగౌడనహళ్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు.
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ సురేంద్ర సూచించారు.
తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతినెలా 5వ తేదీ కల్లా తప్పనిసరిగా చెల్లించాలని సివిల్ సప్లయ్ గోడౌనలో పనిచేసే హమాలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెనుకొండ పట్టణంలోని సివిల్ సప్లయ్ గోడౌన వద్ద గురువారం వారు హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు.
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో ఉన్న సా సర్ పిట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
మండల కేంద్రంలో సచివాలయం వద్ద రాగుల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.4886తో నిర్ణయించిందన్నారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.