రూప్టాప్ సోలార్పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు.
వంశ పారంపర్యంగా వందేళ్ల నుంచి సాగు చేసు కుంటున్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేవని, ఆనలైనలో కూడా నమోదు కాలేదని,పరిష్కారం చూపాలని మండలంలోని మూల గిరిపల్లికి చెందిన రైతులు మంత్రిని కోరారు.
డీ. హీరేహాళ్ మండల తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వజ్రకరూరు మండల కేం ద్రంలో మంగళవారం జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభ వంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం పల్లకిసేవ, రథాంగ హోమం, రథ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు.
హంపి పున్నమి ఉత్స వాల్లో భాగంగా కంబదూరు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం మంగళ వారం మండల కేంద్రంలో అశేష భక్త జనం నడుమ కన్నుల పండువ గా సాగింది. ఉదయం ఆలయంలో శివపార్వతులకు విశేష పూజలు చే శారు
మండలంలోని డొనేకల్లు గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం పాలన లేకుండా పోతోంది. సో మవారం ఉదయం 10.30 గంటలైనా ఆ సచివాలయం వాకిలి తెరవక పోవడమే అందుకు నిదర్శనం. డొనేకల్లు గ్రామానికి చెందిన కొంత మం ది నాయకులు పనుల నిమిత్తం సోమవారం సచివాలయం వద్దకు వెళ్లారు.
బ్యాంక్లో నగదు దాచుకున్నట్లు మనం నీటిని భూమిలో దాచుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
హంద్రీనీవా నీటితో కూడేరు సమీపంలోని ఓబులయ్య కుంటను నింపి రైతులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు కూడేరు రైతులు విన్నవించారు. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలోని తాగునీటి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడేరు రైతులు ఆది వారం మంత్రిని కలిశారు.
పట్టణంలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు.