ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
పంటలకు రసాయనిక ఎరువులు వాడకం ద్వారా కలుగుతున్న అనర్థాలపై రైతుల్లో చైతన్యం వచ్చింది. రసాయనిక ఎరువుల వాడకంతో పంట పెట్టుబడి, ఖర్చులు కూడా భారీగా వస్తున్నాయి.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.
మండ లంలో గీతా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించి గ్రీవెన్సకు ఎప్పటిలాగే అధికారులు డుమ్మా కొట్టారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి మీ ఇంటివద్దకే వచ్చామని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గోవిం దురాజులపల్లిలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన ప్రతి ఇంటివద్దకు వెళ్లి పింఛనదారుల యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందించారు.
మండలపరిధిలోని చౌటకుం ట పల్లి నుంచి కదిరి మెయిన రోడ్డుకు లింక్రోడ్డు పనులు జరగుతు న్నాయి. ఈ రోడ్డుకు అనుకుని మూడు పాడు బడిన బావులు ఉన్నా యి. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేవు. బావుల వద్ద గోడ లు లేకపోవడం వల్ల లింక్ రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చి నప్పుడు వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించిని ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వరప్ర సాద్ కదిరి పట్టణంలోని వాహనాల యజమానులకు, డ్రైవర్లకు రహదా రి భద్రత నిబంధనలపై అవగాహన క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐపై మాట్లాడుతూ... రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్సఆర్ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు.