హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఆదివారం నాడు ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే.
అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.
మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.
పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.
కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్, అర్బన పరిధిలోని పలు పోలింగ్ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. బీఎల్ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్వోకు అందజేశారు.