మండల పరిఽధిలోని కటారుక్రాస్లోని రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్స, డీఎంహెచఓకి సూచించారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ ఏడాది దానిమ్మ రైతు పంట పండింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దానిమ్మ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో దానిమ్మ సాగుచేసిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్పై అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.
మండలం మాగేచెరువు వీఆర్ఓ సోమశేఖర్నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్కు ఫిర్యాదు చేశారు.
మండలంలోని గడేకల్లులో కొండపై వెలసిన చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి విద్యుత లైట్లు ఏర్పాటు చేశారు.
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు.
హెచ్చెల్సీ ఆయకట్టులో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ సారి దిగుబడి కూడా ఆశాజనంగా ఉంది