పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మండలంలోని మాల్యం ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, ప్రణవానంద, గోపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణ, అమరవాణి, లక్ష్మీదేవి తదితరులను సన్మానించారు.
మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు.
మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్చల్ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
విద్యతోనే సమాజంలో గౌరవం, ఉన్నత స్థాయి దక్కుతాయని రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపూనాటి శంకరయ్య తెలిపారు. ఆదివారం శ్రీనివాసనగర్లోని బాలాజీ కల్యాణమండపంలో సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.
మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.
క్రీడలు మానసికోల్లాసం ఇవ్వడంతోపాటు జీవితాన్ని మారుస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని పాపంపేటకు చెందిన టీడీపీ యువ నాయకుడు హరీ్షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.