డిమాండ్ల సాధనకు అంగనవాడీల రిలే దీక్ష
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:49 AM
సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ధర్మవరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక సీడీపీఓ కార్యాలయం వద్ద అంగనవాడీలు సోమవారం రిలేనిరాహారదీక్ష చేపట్టారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని, వేతనాలు పెంచాలని, ఖాళీలను భర్తీ చేయాలని.. డిమాండ్ చేశారు. ఇందులో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అమూబ్ఖాన నాయకులు జేవీరమణ, ఎల్ ఆదినారాయణ పాల్గొన్నారు.