తన కన్నతల్లి వైఎస్ విజయమ్మకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిండు అసెంబ్లీలో తన తల్లి వైఎస్ విజయమ్మను బొత్స సత్యనారాయణ అవమానించారని తెలిపారు.
వినూత్న పంటలను పండించడంలో తాము ఎవరికీ తీసిపోమని మరోసారి నిరూపించారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డి. మండుటెండలకు నిలయమైన అనంత నేలపై, చల్లని ప్రదేశాల్లో పెరిగే 'ఆపిల్' పంటను సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలను పట్టణంలోని నాలుగోవార్డులో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
మండలంలోని చిగతుర్పి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆర్డీవో ఆనంద్కుమార్ గురువారం పరిశీలించారు.
పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మీడియాపై దాడి అప్రజాస్వామికమని, మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఏబీఎన ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీసీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్రెడ్డి అన్నారు.
తమకు బకాయి ఉన్న రెండు నెలల గౌరవవేతనం ఇవ్వాలని మండలంలోని యానిమేటర్లు స్థానిక ఐకేపీ కార్యాలయంలోనీ ఏపీఎం సూర్యనారాయణకు గురువారం వినతి పత్రం అందజేశారు.
పట్టణంలోని చికెన దుకాణాల నుంచి కోళ్ల వ్యర్థాలను తరలించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.