మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు.
స్థానిక విద్యుత శాఖ సబ్ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.
ప్రజా ప్రయోజనాల దృ ష్ట్యా, ప్రజల కోరిక మేరకు నంబులపూలకుంట తది తర సమీప పంచాయతీ లో సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. సీఎస్ఆర్ నిధులు రూ. కోటితో మండలకేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. మండకేంద్రమైన ఎన్పీ కుంట, పి. కొత్తపల్లి రెవెన్యూ గ్రా మాల్లో సోలార్ అల్ర్టా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
హిందువులందరూ సంఘటితమైతే భారతదేశానికి తిరుగుండదని కమలానందభారతీ సరస్వతిస్వామి అన్నారు. స్థానిక శివాలయం వీధిలో ఉన్న షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.
రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.
పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్అలుక్కాస్ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు శనివారం మం డలకేంద్రానికి చేరాయి. దీంతో రై తులు ఎంతో ఆనందంగా ఉన్నా రు. మండలపరిధిలోని వంకమద్ది చెరువు నిండి మరవ ప్రవహిం చడంతో, మండల కేంద్రానికి నీరు మళ్లించారు. మండల కేం ద్రానికి అనుకుని హంద్రీనీకాలువ లో వెళ్తున్న కృష్ణాజలాలను చూ డడానికి ప్రజలు తరలి వెళ్తున్నా రు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేసేందుకు కార్యాచ రణ రూపొందిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జి. ఓబులు పేర్కొన్నారు. ఆయన శనివారం ఓబులదేవరచెరువులో సీఊటీయూ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గాండ్లపెంట మంలలానికి త్వరలో కృష్ణా జలాలు వస్తాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శని వారం స్థానిక ఆర్అండ్బి బంగ్లాలో విలేక రులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా జలాలు తెచ్చేందుకు ప్రభుత్వం జేఓ జారీ చేసిందని, ఎస్ఈ శనివారం పర్యటించారని తెలిపారు.