దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పట్టణంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
మండలంలోని చినన్నపల్లిలో సోమవారం ఉద యం కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు మంటల్లో చిక్కుకుంది. ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది.
నార్పల మండలం గుంజేపల్లి గ్రామానికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎ్సలో కలెక్టర్ ఆనంద్ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణ కోసం మంజూరు చేసిన ఎనక్యా్ప నిఽధులకు సంబంధించిన పనులు చేసేందుకు అనుమతివ్వాలని కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు. సోమవారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎ్స)లో ఎస్ఈ రాజశేఖర్తో కలిసి కమిషనర్ జస్వంతరావు అర్జీలు స్వీకరించారు.
మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్లీగ్ క్రికెట్ లీగ్ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్లీగ్ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.
వైసీపీ ప్రభుత్వ హ యాంలో పట్టాలు ఇచ్చిన భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మార్పీఎస్ నాయకుడు బీసీఆర్ దాస్ అన్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎంపీహెచఏ(మేల్)లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్స్టాఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులను కోరింది.
మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్, విద్యుతశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మున్సి పల్, విద్యుతశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.