స్థానిక ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్ శర్మ హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.
మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో పం టలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డి మాండ్ చేశారు
వేళకు సరిగా ఆర్టీసీ బస్సులు నడపడం లేదని మండలంలోని ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం, బళ్లారి రాహదారిపై కళాశాల, హైస్కూల్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులతో కలిసి మంగళవారం ధర్నా నిర్వహించారు.
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన గుండంలో హనుమాద్ మాలధారులు మంగళవారం ఇరుముడులు సమర్పించారు
మండలంలో రబీలో బోరుబావుల కింద సాగుచేసిన వేరుశనగ పంటకు పొగమంచు కారణంగా తిక్కాకు తెగులు, అగ్గి, పచ్చపురుగు తెగుళ్లు సోకాయి.
కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.