Home » Andhra Pradesh » Ananthapuram
లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో రెండు మూడు రోజులుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తు న్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చీఫ్ ఎలెక్షన ఏజెంట్ జేఈ అనిల్కుమార్ మంగళవారం పోస్టల్బ్యాలెట్ పోలింగ్ కేంద్రంవద్ద హిందూపురం ఎన్నికల రిటర్నిం గ్ అధికారి, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ను కలిశారు.
స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రౌడీయిజానికి దిగాయి. కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో టీడీపీ కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమె రోడ్ షోకు భారీగా జనం తరలిరావడంతో జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు మిద్దెలపైకి ఎక్కి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీకి చెందిన కొందరు యువకులు మిద్దెలపైకి ఎక్కి మీసాలు దువ్వుతూ.. తొడలు ..
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కసిగా మార్చుకొని ఓటుతో బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన’ నుంచి.. ‘నిన్ను నమ్మం జగన’ అనే పరిస్థితికి వచ్చారు. అడిగినందుకు ఒక్క చాన్స ఇచ్చామని.. ఐదేళ్లలో జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. పేరూరు, ..
టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ ప్రచారం రథం ఎదురుపడింది. దీంతో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. అయితే బీకే సంస్కారాన్ని ప్రదర్శిస్తూ పరిస్థితిని చక్కదిద్దారు. గోరంట్ల మండలంలోని మల్లాపల్లిలో సోమవారం సాయంత్రం బీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని రెండోవార్డుకు చెం దిన ఆశా కార్యకర్త షబ్బరీ మంగళ వారం ఆత్మహ త్యా య త్నానికి పాల్ప డింది. ఉన్నతాధి కారుల వేధింపుల తో ఆమె విషద్రావ కం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యక ర్తలు ఆసుప్రతి వద్ద రోడ్డుపై భైఽఠాయించి ధర్నా చేపట్టారు. శివాల యం వీధిలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్ద 104 వాహనంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య పరీక్షలను మంగళవారం నిర్వహించారు. ఆ సమ యంలో బీపీ మిషన, స్టెతస్కోప్ కనిపించ లేదని ఎంఎల్హెచపీ గౌతమి దొంగతనం నేరం మోపుతూ ఆశాకా ర్యకర్త షబ్బరీని అందరి ముందు మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన షబ్బరీ జెండాలబండ వీధిలోని తన ఇంటికెళ్లి విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పోలీసుల తీరులో మార్పు వస్తోంది. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద మంగళవారం ఆంక్షలు పెట్టారు. సీఐలు తమ సిబ్బందిో ఉదయమే అక్కడికి చేరుకుని.. వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న టెంటును తొలగించాలని సూచించారు. అక్కడ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ వాళ్లను కూడా పంపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పోలీసులతో ..
ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పెను కొండలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా వారు అనుసరించిన విధానమే అందుకు నిదర్శనమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె మంగళవారం మండలంలోని గుట్టూరు, వెంకటగిరిపా ళ్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా సవితకు పూల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలను అరికడదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళ వారం పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాల నంతా అరాచకాలు, అఘాయిత్యాలతో సాగిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింద న్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్ర జలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు.
పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాలు బంద్ చేయాలి. అప్పటి నుంచి ఎలాంటి లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం అనుమతి రోజుల్లో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్వీకర్లు, ఇతర సౌండ్ పరికరాలను ఉపయోగించకూడదు.