శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. బాబా చూపిన బాటలో అందరం నడుద్దామని పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లిలోని స్తోత్రాద్రి కొండ చుట్టూ స్వామివారి భక్తులు మంగళవారం గిరిప్ర దక్షిణ చేశారు. మొదటగా స్వామివారి భక్తులు లక్ష్మీనరసింహ స్వా మి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి బయల్దేరారు. శ్రీవారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలు, గోవింద నామస్మరణతో శ్రీవారి స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
మండలకేంద్రంలోని సహ కార సంఘం కార్యాలయంలో మంగళవారం అఖిలభారత సహకార వారోత్సవాలను సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్డివిజన అధికారి శివకుమార్ హాజరయ్యారు. సహకార సంఘం కార్యాలయంలో మొదటగా జెండా ఆవిష్కరించారు.
మం డలపరిధిలోని గంటా పురానికి చెందిన శ్రీని వాసులు మంగళవారం అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభిం చారు. మండలంలోని గంటాపురం గ్రామంలో దాతల సహకారంతో రామాలయం నిర్మా ణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా నిర్మాణం పూర్తి కాలేదు.
సత్యసాయిబాబా శతజ యంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమో దీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు రానున్న సందర్భంగా మంగళవారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను మంత్రుల బృం దం పరిశీలించింది.
జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి డాక్టర్లు కొందరు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. విధులకు వచ్చినట్లు ఎఫ్ఆర్ఎ్స(ఫేషియల్ రికగ్నిషన సిస్టమ్)ను వేసి వెళ్లిపోతున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీలోని ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు పీజీ విద్యార్థులు మొత్తం 539మంది ప్రభుత్వ వైద్యవిద్యకళాశాల పరిధిలో పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఉదయం 9.10గంటల్లోపు ఎంట్రీ ఎఫ్ఆర్ఎస్, సాయంత్రం ...
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తులనడుమ సత్యసాయి నారాయణ...
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనంత కోటి దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో లలితకళా పరిషతలో మంగళవారం సాయంత్రం కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ అష్టాక్షరి పీఠానికి చెందిన త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు కార్తీక ...
దేశంలో సామాజిక న్యాయానికి పాతర వేశారనీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలపె దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర నేత జగదీష్ పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో ...