మండలంలోని బూదిగుమ్మలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంజనేయస్వామి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.
మండలంలోని పెన్నహోబిలం పెన్నానది వద్ద ఆదివారం ఏటిగంగమ్మ తిరునాళ్లును వైభవంగా నిర్వహించారు.
మండలానికి తూర్పున వైపున ఉన్న పది గ్రామాల ప్రజల 50 ఏళ్ల కల త్వరలోనే నెరవేరస్తున్నట్లు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
మండలపరిధిలోని అచ్చేమియా పల్లిలో అచ్చేమియా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండకమర్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు జౌలీ అల్లా బకాష్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఒంటెలు, గుర్రాలపై గంధాన్ని ఫకీర్ల జల్సాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గా లోప్రార్థనలు చేశారు.
మండలంలోని రావుల చెరువు పంచాయతీలోని నాగిరెడ్డికుంట కొట్టాల గ్రామ సమీపాన ఉన్న కుంట నిండి మరువపారుతోంది. ధర్మవరం చెరువు నుంచి నీరు రావడం తో కుంట నిండింది. ఈ కుంట కింద సుమారు 50 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.
మాఘ మాసం ఆదివారం పురస్క రించుకుని మండలంలోని పలు గ్రామాల్లో పాల పొంగుల వెల్లువను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజా మునే మాఘస్నానాలు ఆ చరించి కొత్తకుండలో పాలుపోసి పొంగులు ని ర్వహిం చారు.
స్థానిక కస్తూర్బా కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డులో కస్తూర్బా కాలనీ ఉంది. స్థానిక కస్తూ ర్బా పాఠశాల సమీపంలో గత టీడీపీ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 2017 నుంచి ఇళ్ల నిర్మాణం జ రుగుతూనే ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అభినందించారు.