పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు.
పట్టణంలోని పోలీస్స్టేషన తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం రాత్రి పర్య టించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలో ఏమైనా సమస్య లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు.
వివిధ పనులపై స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు.
గత ప్రభుత్వంలో రాయలసీమను పూర్తిగా విస్మరించారని వైసీపీ నేతలపై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమపై ప్రేమ ఉన్నట్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్పై వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని పాత స్టేట్బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు.
మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్, పెట్రోల్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్ ఔట్లెట్లకు సకాలంలో డీజిల్, పె ట్రోల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు.