మండలంలోని ఏ.కొండాపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చెత్త నిల్వ ఉంది. ఆ చెత్త గాలికి ఎగిరి వస్తుండటంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానిక వంద పడకల ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్వో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రూ. 1.70 లక్షలను వినాయక అసోషియేషన సభ్యులు, మా సమ్మేళన సమితి సభ్యులు విరాళంగా ఇచ్చారు.
మండలంలోని శింగానహళ్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
లేబర్ కోడ్లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్సర్కిల్, ఆర్డీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
మండలకేంద్రంలోని మ స్తానవలీ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం జియారతతో ముగిసినట్టు ముతవల్లి మాణిక్యంబాబా తెలిపా రు. ఉరుసు మహోత్సవాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
మండల పరిధి లోని అప్రాచెరువు గ్రామంలో వెలసిన వీరనారాయణస్వామికి గ్రామస్థుల ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మూడు రో జుల పాటు వీరనారాయణ స్వా మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు. అందులో భాగంగా ఆ దివారం ఎలవ గంపను ఊరేగిం చారు
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రహరీ లేకపోవడంతో విషపురుగుల భ యంతో విద్యార్థులు గడపాల్సి వస్తోంది. మండలంలోని కొండకమర్ల, గౌనిపల్లి, ఓబులదేవరచెరువు, మిట్టపల్లిల్లో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి.
పట్టణంలోని పెన్నానది ఒడ్డున జేసీ పార్కు సమీపంలో పెన్నా బండ్ను ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు.
కంబదూరు మల్లేశ్వరస్వామి దేవాలయంలో గంగపూజతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.