అధికారుల ఒత్తిళ్లతోనే కర్నూలులో వీఆర్వో హుస్సేన ఆత్మహత్య చేసుకున్నారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన నాయకులు విమర్శించారు. వీఆర్వో ఆత్మహత్యకు నిరసనగా సోమవారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్వద్ద వారు నిరసన తెలిపారు.
కర్నూలు జిల్లాలో వీ ఆర్వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(సర్) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ సూచించారు. బుధవారం అర్బన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
కార్యకర్తల కష్టంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్)పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో సోమవారం క్లస్టర్, యూనిట్, బూతలెవల్ ఏజెంట్లు, నాయకులతో సమావేశమై సర్పై అవగాహన కల్పించారు.
తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.
అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు.
కేబుల్ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్ నెట్వర్క కేబుల్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.
ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.
మండల పరిధిలోని ఉద్ధేహాళ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.