Share News

ఆస్పత్రిలో నీటి వసతికి సాయం

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:10 AM

స్థానిక వంద పడకల ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్వో వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన రూ. 1.70 లక్షలను వినాయక అసోషియేషన సభ్యులు, మా సమ్మేళన సమితి సభ్యులు విరాళంగా ఇచ్చారు.

ఆస్పత్రిలో నీటి వసతికి సాయం
నగదు అందజేస్తున్న సభ్యులు

రాయదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): స్థానిక వంద పడకల ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్వో వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన రూ. 1.70 లక్షలను వినాయక అసోషియేషన సభ్యులు, మా సమ్మేళన సమితి సభ్యులు విరాళంగా ఇచ్చారు. ఆ నగదును ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జ్ఞానసుధ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. విప్‌, ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి ఛైర్మన కాలవ శ్రీనివాసులు పిలుపు మేరకు ఈ విరాళం అందజేసినట్లు వారు తెలిపారు. ఇందులో ఈ కార్యక్రమంలో శ్రీవినాయక సర్కిల్‌ అసోషియేషన అధ్యక్ష కార్యదర్శి బీసా శ్రీనివాసులు, కెరె వినాయక, సభ్యులు తాయి శేఖర్‌, కోదండ సత్యనారాయణ, ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌, మామిళ్ల మల్లికార్జున, రాజేష్‌, నాగరాజు, రేకులకుంట సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:10 AM