రైతులకు పాస్పుస్తకాల పంపిణీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:08 AM
మండలంలోని శింగానహళ్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి) : మండలంలోని శింగానహళ్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. గత వైసీపీ ముఖ్యమంత్రి జగనరెడ్డి తీసుకోచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే నల్ల చట్టాన్ని రద్దు చేసి రైతుకు మేలుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.