22A భూముల వివాదానికి కారణం ఎవరు.?.. రంగంలోకి సీఎంఓ

ABN, Publish Date - Aug 19 , 2026 | 11:08 AM

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది.

ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ జాబితాను రూపొందిస్తే తర్వాత ఏడు నెలలకు ఇంత వివాదం నెలకొనడానికి కారణం ఏంటని సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు.


కొంతమంది రెవెన్యూ అధికారులను వివిధ వర్గాలకు చెందిన వారిని పిలిపించుకుని ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, సమస్యపై ఇంత చర్చ జరగాడానికి, ఇంతకాలం తర్వాత తెరమీదకు రావడానికి గల కారణాలు ఎంటని అధికారులు తెలుసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో పెట్టేందుకు పాత రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు ఎవరెవరు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారనే కోణంలో సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Aug 19 , 2026 | 11:10 AM