ఎరుపెక్కిన మార్కెట్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:57 PM
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. గురువారం సుమారు 35 నుంచి 40వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది.
యార్డుకు చేరిన 40 వేల బస్తాల మిర్చి
వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. గురువారం సుమారు 35 నుంచి 40వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. ఈ సీజన్లో ఇదే అ ధికం. దీంతో యార్డులో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శన మిచ్చాయి. మిర్చి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మార్కెట్లో మంచి నాణ్యత ఉన్న మిర్చికి గరిష్టంగా పలికిన ధరలు ఇలా ఉన్నాయి...
తేజ(Teja) రకం మిర్చి క్వింటాకు రూ.18,800, వండర్హాట్ రూ. 35వేలు, యూఎస్.341 రూ.21వేలు, దీపిక రూ. 30వేలు, ఎల్లోమిర్చి రూ.20 వేలు, సింగిల్పట్టి రూ.40వేలు, దేశీ మిర్చి రూ.40వేలు, తాలు క్వింటాకు రూ. 12వేలు పలికింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు
Read Latest Telangana News and National News