Home » Warangal
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు (గురువారం) రాజ్భవన్కు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో షర్మిల భేటీకానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టైగర్జోన్ల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెద్ద పులుల మనుగడకు ఆటంకంగా మారుతున్న జనసంచారాన్ని తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అభయారణ్యంలో ఉన్న జనవాసాలను మైదాన ప్రాంతంలోకి తరలించాలన్న ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం మొదటిసారిగా 2012లో తీసుకువచ్చింది. టైగర్జోన్ ప్రాంతాల్లో జనసంచారం లేకుంటేనే, ఇతర వన్య ప్రాణుల సంతతి వృద్ధి చెందుతుందని, అక్కడ నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాల్లోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
పక్కనే కెనాల్ ఉన్నా నీటిని వినియోగించుకోవడానికి రైతులకు వీలులేకుండా పోతోంది. స్టేషన్ఘన్పూర్ మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల మీదుగా స్టేషన్ఘన్పూర్-పాలకుర్తి కెనాల్ ద్వారా నీళ్లు వెళుతున్నా సంబంధిత గ్రామాలకు సాగునీరు అందడంలేదు.
రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో పర్యటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఉత్కంఠ నెలకొం ది. ఈసారైనా తమ ఆశలు చిగురిస్తాయా..? అని భూపాలపల్లి, ములుగు జిల్లాల వాసులు ఎదురుచూ స్తున్నారు.
రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రశ్నిం చారు. హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదప్రజలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టేందుకు సిద్ధం కాగా, సుబేదారి పోలీసులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అంబేద్కర్కాలనీలోని గుడిసెల్లో ఉన్న ఆకునూరి మురళి, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్లను అరెస్టు చేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కలెక్టర్లు బదిలీకాగా, రాజీవ్గాంధీ హనుమంతుకు కూడా స్థాన చలనం జరిగింది.
జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.
అర్హులైన వారందరికీ ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఈ-నామ్ పద్ధతిలో ప్రారంభమైన మిర్చి, అపరాల కొనుగోళ్లను మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అజ్మీర రాజు పరిశీలించారు.