Home » Warangal
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతివివక్ష' వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు.
వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
డిసెంబర్లో గెలిచింది సెమీ ఫైనల్సే.. ఇప్పుడున్నవి ఫైనల్స్. అసలు కథ ఇప్పుడు మొదలైంది.. తెలంగాణ వర్సెస్ గుజరాత్.. ఎవరు గెలుస్తారో చూద్దాం..
కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
ఉద్యమాల గడ్డ.. పోరాటాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేల. పీవీ నర్సింహారావు వంటి రాజకీయ ఉద్ధండుణ్ని పార్లమెంటుకు పంపించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గం.. ఇప్పుడు ముక్కోణపు పోటీకి
మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.