మక్క రైతుకు మంచి రోజులు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:59 PM
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నల ధర రోజురోజుకూ పెరుగుతోంది.
క్వింటా ధర రూ.2,630
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నల ధర రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో క్వింటా ధర రూ.2400 ఉండగా క్రమంగా పెరిగి రూ.2630లకు చేరింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఉప్పుల రాజుకు చెందిన 226 బస్తాల మక్కలను సోమవారం సీతారామ అడ్తి ద్వారా వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు క్వింటాకు రూ.2630ల చొప్పున కొనుగోలు చేశారు.
మూడు నెలల క్రితం మద్దతు ధర రూ.2400లు పలికినప్పటికినీ మార్క్ఫెడ్ వారు కొనుగోలు చేసేందుకు రైతులకు చుక్కలు చూపించారు. మార్క్ఫెడ్ సెంటర్లలో రైతులు 15-20 రోజులపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు రూ.1700ల నుంచి రూ.1900 వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటాకు రూ.2630 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్ధన్
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News