హైదరాబాద్లో వ్యభిచార దందా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో విటులు..
ABN , Publish Date - Feb 08 , 2026 | 08:46 AM
హైదరాబాద్ నగరంలో వ్యభిచార దందాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో వ్యభిచార దందాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కేపీహెచ్బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వసంతనగర్ ప్రాంతంలోని జై శ్రీ వెల్నెస్ బ్యూటీస్ (Jai Sri Wellness Beauties) అనే స్పా సెంటర్ కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. మసాజ్ సెంటర్ పేరుతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
ఏహెచ్టీయూ రంగ ప్రవేశం..
ఈ సోదాల్లో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (Anti Human Trafficking Unit) అధికారులు కీలక పాత్ర పోషించారు. పక్కా ప్లాన్తో స్పా సెంటర్పై దాడి చేసి, అక్కడ జరుగుతున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. స్పా సెంటర్లో ఉన్న 9 మంది విటులను ఏహెచ్టీయూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేపీహెచ్బీ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు.
పోలీసుల చర్యలు..
విటులను అప్పగించిన తర్వాత కేపీహెచ్బీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార నిర్వాహకులు ఎవరు..?, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో మసాజ్ సెంటర్ల పేరుతో ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 100 నంబర్కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్కు కిషన్రెడ్డి వార్నింగ్
వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..
Read Latest Telangana News And AP News And Telugu News