నేటి నుంచి మరో 14 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 09:30 AM
హైదరాబాద్ నగరంలోని వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలను మరో 14 రోజులపాటు పొడిగించారు.
వైశాలినగర్ అండర్పాస్ పనులు..
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలను మరో 14 రోజులపాటు పొడిగించారు. సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల కోసం గతంలో జూలై 16 నుంచి 20 రోజులు,
అనంతరం మరో 29 రోజులు ఆంక్షలు విధించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తికాకపోవడంతో ఈ ఆంక్షలను తాజాగా మరో 14 రోజులపాటు పొడిగించారు. వైశాలినగర్ అండర్పాస్ మీదుగా వచ్చి వెళ్లే వాహనాలను మైహోమ్ మంగళ టి-జంక్షన్ వద్ద మళ్లిస్తారని, ప్రయాణికులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల
జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News