కొడుకే అడ్డం పడుతుంటే...!
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 AM
తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
అన్నాడీఎంకే అభ్యర్థికి వ్యతిరేకంగా కుమారుడి ప్రచారం
చెన్నై: తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. తొలుత తండ్రికి బదులు తనకు సీటు కేటాయించాలంటూ కుప్పన్ కుమారుడు కార్తీక్ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. అయినా, పార్టీ కుప్పన్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ కారణంగా, కార్తీక్ తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. తన తండ్రికి ఓటు వేయద్దంటూ మద్దతుదారులతో నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు.
ఈ క్రమంలో, కుప్పన్కు మద్దుతుగా బుధవారం ఉదయం ప్రచారం చేపట్టిన పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి గోకులకృష్ణన్ను కార్తీక్, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. ఒకానొక సమయంలో కొందరు గోకులకృష్ణన్పై దాడిచేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఆ నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News