శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 06:37 AM
రుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

బుధవారం హుండీ ఆదాయం: రూ.4.02 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,703
తలనీలాలు సమర్పించినవారు: 37,581
ఈ వార్తలు కూడా చదవండి:
గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ నోటీసులు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News